మేనత్త హఠాత్ ఎంట్రీ కారణమేంటి?

Publish Date:Apr 13, 2024

Advertisement

సెంటిమెంట్.. ఇది ఎంత ప్రభావమంతమో.. గత ఎన్నికలలో ఆ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిన జగన్ కంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. అందుకే పులివెందుల గడ్డపై సొంత చెల్లెలు షర్మిల, చిన్నాన్న కూతురు సునీత  ప్రచారం, సంధిస్తున్న విమర్శలు, వివేకా హత్యను ప్రస్తావిస్తూ ప్రజలకు చేస్తున్న వేడికోలు జగన్ ను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పులివెందులలో షర్మిల, సునీతల ప్రచారం జగన్ కు ఓటమిని ముందే చూపించేస్తోందా అన్న అనుమానం కలిగిస్తున్నాయి ఆయన పార్టీ నేతలూ, క్యాడర్ చేస్తున్న హడావుడీ, పడుతున్న కంగారూ చూస్తుంటే. షర్మిల ప్రచారం సమయంలో  విద్యుత్ కట్ అవ్వడం, షర్మిలను అడ్డుకోవడానికి వైసీపీ మూకలు చేసిన విశ్వయత్నం జగన్ లో నెలకొన్న భయాన్నే ఎత్తి చూపాయి. ఇక వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాడికి తెగబడేంత హడావుడి చేసినా షర్మిల ఎక్కడా తగ్గలే.  

షర్మిల ప్రచారంతో పులివెందులలో జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. రోజు రోజుకూ పదునెక్కుతున్న షర్మిల మాటలకు సెంటిమెంట్  కూడా జోడించి షర్మిల పులివెందుల ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారన్న భయం జగన్ లో ఏర్పడింది.  మీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డ‌… మీ వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ‌తో క‌లిసి వ‌చ్చి  అర్ధిస్తోంది. ఆడ‌బిడ్డ‌గా కొంగుచాపి అడుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో హంత‌కుల‌ను ఓడించి, ష‌ర్మిల‌కు ఓటేయ్యండి అంటూ ఆమె చేసిన అప్పీల్ జగన్ లో గుండె గాభరా కలిగించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ లో భయం పెచ్చరిల్లడంతోనే హడావుడిగా మేనత్త విమల్మను రంగంలోకి దింపారంటున్నారు. ఆమె మేనత్తగా  పెద్ద రికాన్ని ప్రదర్శిస్తూ.. తాను వైఎస్ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నాను అంటూ షర్మిల, సునీతలకు సుద్దులు చెప్పారు. కుటుంబాన్ని పలుచన చేయవద్దని మందలించారు.  ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోకి వెళ్లి చేస్తున్నవిమర్శలు కట్టిపెట్టి నోరు మూసుకోండంటూ హెచ్చరించారు.  

జ‌గ‌న్, అవినాష్ కు అండ‌గా ఉండాల‌ని పులివెందుల, కడప ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి షర్మిల కుటుంబ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని భావిస్తే ఆ విషయం తల్లి విజయమ్మ చెప్పాలి. అలాగే సునీతను మందలిస్తే ఆమె  తల్లి సౌభాగ్యమ్మ మందలించాలి. కానీ వారిద్దరూ కూడా తమ కూతుళ్లకే మద్దతుగా ఉన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే నిన్నటి వరకూ షర్మిలతోనే ఉన్న విజయమ్మ.. ఇప్పుడు హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారంటే.. అది జగన్ ఒత్తిడి వల్లేనని ఆ కుటుంబ సన్నిహితులే చెబుతున్నారు. జగన్ తరఫున ప్రచారం చేయడానికి ఇష్టపడక, షర్మిలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి మనస్కరించక ఆమె రాష్ట్రానికి దూరంగా విదేశాలకు వెళ్లారు. ఆ వెళ్లడం కూడా షర్మిల కుమారుడి వద్దకే వెళ్లారు. దీనిని బట్టే విజయమ్మ మద్దతు ఎవరికో అర్ధం అవుతుంది. ఇక సౌభాగ్యమ్మ అయితే షర్మిల, సునీతలకు అండగా ఉన్నారు. తన భర్త హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని ఆమె మీడియా ఎదుటే కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విమలమ్మ మేనకోడళ్లకు సుద్దులు చెప్పడం విషయానికి వస్తే..  విమలమ్మ తొలి నుంచీ జగన్ కు మద్దతుగానే నిలిచారు.

 క్రైస్తవ మత బోధకురాలిగా ఆమె ఏపీలో విస్తృతంగా పర్యటించి పాస్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ కు మద్దతు కూడగట్టడానికి శతధా ప్రయత్నించారు.  ఆ క్రమంలో ఆమె విఫలమయ్యారు. కాకినాడలో అయితే పలువురు ఫాదర్లు ఆమెకు ఎదురుతిరగడంతో దొడ్డి దారిన వెళ్లిపోయారు.  ఆ తరువాత ఆమె పెద్దగా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ మేనగోడళ్లను జగన్ తరఫున మందలించడానికి వచ్చారు. 

వైఎస్ కుటుంబం అంతా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నా విమలమ్మ మాత్రం జగన్ తో జగన్ కు మద్దతుగా నిలవడానికి కారణమేమిటో షర్మిల బయటపెట్టారు.  జగన్మాయలో పడి వైఎస్ వివేకా తన సొంత అన్న అన్న విషయాన్ని మేనత్త విమలమ్మ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. సొంత అన్న వైఎస్ వివేకానందరెడ్డిని  కిరాతకంగా హత్య చేసిన వారి పక్షాన విమలమ్మ నిలవడానికి కారణం ఆమె కుమారుడికి జగన్ వర్క్స్ ఇవ్వడమేనని షర్మిల కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని, తాము ఆరోపణలు చేయడం లేదనీ చెప్పిన షర్మిల  సీబీఐ చూపిన ఆధారాలనే తాము చెబుతున్నామన్నారు. హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నామని చెప్పారు.   ఇకనైనా విమలమ్మ వాస్తవాలు తెలుసుకుని మసలుకోవాలన్నారు. సొంత అన్నను కిరాతకంగా హత్య చేసిన వాళ్ల తరఫున మాట్లాడటం మానుకోవాలని హితవు చెప్పారు.  మేనత్తను రంగంలోకి దించి షర్మిల, సునీతలను నిలువరించాలన్న జగన్ యత్నం షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ తో విఫలమైందని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.