వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో యలమంచిలి రవి!
Publish Date:Apr 26, 2012
Advertisement
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి రవి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయనాయకునిగా కాకుండా రైతువారి పద్ధతిలో వుండే రవి అంటే ప్రజలలో మంచి గుర్తింపు వుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసి రవి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి మాజీ ఎంపి గద్దె రామమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ (రాజశేఖర్)లను ఓడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటం వల్ల మాజీ మంత్రి దేవినేని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వున్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన నేపథ్యంలో యలమంచిలి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం నియోజకవర్గంలో శాసనసభ్యుడే ఇన్ ఛార్జిగా వుంటారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించే ప్రభుత్వపరమైన సమీక్షా సమావేశాల సందర్భంగా, పిసిసి అధ్యక్షులు బొత్స నిర్వహించే సమీక్షాసమావేశాల సందర్భంగా తూర్పు నియోజకవర్గం తనపై ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూను కూడా ఆహ్వానించడాన్ని తనకు అవమానంగా భావిస్తున్నారు. వాస్తవంలో కూడా ప్రభుత్వం యలమంచిలి పట్ల సవితి ప్రేమనే చూపిస్తోందనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థితిలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీనుంచి యలమంచిలికి ఆహ్వానం లభించినట్టు తెలిసింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన వంగవీటి రాధా ఇటీవల వరకు విజయవాడ సెంట్రల్ నుంచి కాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే భావనలో వున్నారు. కాని రాధా 2014 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి కాకుండా సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ స్థితిలో యలమంచిలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరితే మరల 2014నుచి కూడా విజయవాడ తూర్పు నుంచే పోటీ చేయవచ్చునని ఆయనకు వివరించినట్టు తెలిసింది. యలమంచిలికి దేవినేని నెహ్రూతో ఎంతోకాలం రాజకీయవైరం వుంది. తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ లో వుంటూ నెహ్రూతో వున్న వైరంతో ఇబ్బంది పడేకంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమమనే నిర్ణయానికి యలమంచిలి వచ్చినట్టు తెలిసింది.
http://www.teluguone.com/news/content/vijayawada-west-constituency-mla-yalamanchili-ravi-24-13654.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





