Publish Date:Jan 28, 2025
విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన సృష్టించిన సంచలనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆయన రాజీనామాకు కారణాలు, రాజీనామాకు వెనుక ఉన్న ఉద్దేశాలు, బీజేపీకి అదనంగా ఒక ఎంపీ సీటు ఇవ్వడం కోసమే నంటూ విశ్లేషణలు.. ఇందంతా జగన్ ప్లానే అన్న అనుమానాలూ ఇంకా సాగుతూనే ఉన్నాయి.
ఈ లోగానే విజయసాయి రెడ్డి తన కొత్త ఉద్యోగం మొదలెట్టేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా చెప్పినట్లు వ్యవసాయం చేయడం ఆరంభించేశారు. అలా మొదలెట్టేసి ఊరుకోలేదు. తాను వ్యవసాయం చేస్తున్న ఫొటోలు ఎక్స్ లో పోస్టు చేశారు. రాజకీయాలను దూరమై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాననీ, ఈ వ్యాపకం తనకెంతో హాయిగా, సంతోషంగా ఉందంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వార్తే ఆశ్చర్యం కలిగిస్తే.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ స్వీకర్ క్షణం జాగు చేయకుండా ఆమోదించేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది.
ఇక దానికి మించి విజయసాయిరెడ్డి చిప్పినట్లుగానే వ్యవసాయ వ్యాపకంలోకి దిగిపోవడం ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయి రెడ్డి తాజాగా రైతుగా తన పనుల్లో నిమగ్నమై ఉన్న ఫొటోలను ట్వీట్ చేశారు. ఆ ఫొటోల్లో ఆయన హార్టికల్చర్ సాగు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని చాటుకోవడానికి విజయసాయి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని తేటతెల్లమైపోతోంది. రాజకీయాలు వదిలేశాను ఇదిగో రుజువు.. ఇక నన్ను వదిలేయండి మహప్రభో అని కూటమి నేతలను అభ్యర్థిస్తున్నట్లుగా విజయసాయి ట్వీట్ ఉందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-new-avatar-25-191971.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!