జగన్ కు అమ్మ విజయమ్మ ఓదార్పు

Publish Date:Jun 10, 2024

Advertisement

ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేని గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర సుదీర్ఘంగా సాగింది. మందీ మార్బలంతో ఆయన ఆ యాత్రను విడతల వారీగా ఏళ్ల తరబడి కొనసాగించారు. సరే అది పక్కన పెడితే.. 2014 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ కు సొంత పార్టీ నుంచే అండ కరవైంది. నిన్న మొన్నటి దాకా వంధిమాగధులుగా మెలిగిన కీలక మంత్రులు, నేతలు సైతం ఇప్పుడు ఓటమికి పూర్తి బాధ్యత జగన్ దే అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతూ, పార్టీ ఘోర పరాజయానికి ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ నిందిస్తున్నారు. 

ఈ తరుణంలో తల్లి విజయమ్మ జగన్ కోసం ఆయన ఇంటికి వచ్చి ఒకింత ఓదార్పు ఇచ్చారు. పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు తల్లి విజయమ్మ తన కుమార్తెకు మద్దతు పలుకుతూ అమెరికా నుంచి ఓ వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. దీంతో కన్న తల్లి కూడా జగన్ కు మద్దతుగా నిలవడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తల్లి మనసు ఆగలేదు. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు.  కుమార్తెను గెలిపించమని వీడియో సందేశం ద్వారా పోలింగ్ ముందు రోజు కడప ప్రజలకు పిలుపునిచ్చిన విజయమ్మ.. ఆ సందర్భంగా కుమారుడి గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  ఎన్నికల ముందు లండన్ వెళ్లిన విజయమ్మ, అక్కడ షర్మిల కొడుకు రాజారెడ్డి దగ్గర ఉన్నారు.   అయితే కుమారుడు ఘోరంగా పరాజయం పాలై ముఖ్యమంత్రి పదవి కోల్పోయి పుట్టెడు దుఖంతో ఉండటంతో తల్లిమనసు తల్లడిల్లి అమెరికా నుంచి నేరుగా కుమారుడి వద్దకు వెళ్లి ఓదార్పునిచ్చారు. 

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.