వేటూరి జయంతి
Publish Date:Jan 29, 2014
Advertisement
సినీ తోటలోని పాటలు చెట్టుకు...కొమ్మకొమ్మకు సన్నాయిలు పూయించి....రాగాల పల్లకిలో ప్రేక్షకుల్ని ఊయలలూగించిన పాటల మాంత్రికుడాయిన...తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి. బ్రాహ్మణకుటుంబంలో 1936 జనవరి 29న జన్మించారు వేటూరి సుందరరామమూర్తి.నిత్యం వేదఘోషల మధ్య… సంస్కృత మంత్రోచ్ఛారణల నడుమ పెరిగిన బాల వేటూరికి అచేతనంగానే ఆ సాహిత్యం… అందులోని లయ… పదగాంభీర్యత ఆకట్టుకున్నాయి. ఇలా పుట్టిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో తెలుగు ప్రేక్షకలోకానికి పాటల నైవేద్యం పెట్టే పదార్చకుడిగా మారుస్తుందని వేటూరి సైతం ఊహించలేదు.
వేటూరి కెరీర్- మొదట జర్నలిస్ట్గా మొదలైంది. వార్తా రచన, రిపోర్టింగ్లోని సైతం ఆయన భావగర్భితమైన ప్రయోగాలు చేసేవారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ఆయన పాత్రికేయ జీవితం… కళాతపస్వి కె.విశ్వనాథ్- పిలుపుతో సినీగేయ రచయితగా కొత్త మలుపు తిరిగింది. అలా సుందరరాముడు- ‘ఓ సీత కథ’ సినిమా ద్వారా… విశ్వనాథుడు అంటే శివుడి నిర్దేశకత్వంలో పాటని పరవళ్లు తొక్కించాడు. వేటూరి కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంది. పాదం సయ్యంది. ప్రేక్షకుల తనువులు ఆ నాదంతో పాటే ఊగాయి.
1970 దశకంలో తెలుగు సినిమా పాటల ప్రపంచానికి పిల్ల తెమ్మరలా వచ్చి… ప్రభంజనమై వీచి… సునామీలా చుట్టుముట్టినవాడు – వేటూరి. కృషి + క్రియేటివిటీ కలసిన ఆయన గీతర్షి అయ్యారు. మహాపురుషుడయ్యారు. తెలుగునేల మీద తరతరాలకూ తరగని పాటల నిధి అయ్యారు.రేక్షకుల మనోభావాలను చదివినట్లుగా వారు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారో ఏ సరసాన్ని, ఏ శృంగారాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలను మేలి ముసుగు భావనలతో తన పాటలో పలికించడంలో వేటూరికి వేటూరే సాటి. ఈ పాటల వేటగాడు- ఆకుచాటు పిందె లోని అందాలను రమ్యంగా వ్యక్తీకరించి వానపాటల ట్రెండ్కు నాంది పలికాడు.
1983 నాటికి తెలుగు యూత్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలోని ఎమోషన్స్కి తగినట్లుగా పాటలోని వరుసలు… వారి హృదయ వరుసలు ట్యూన్ అయ్యేలా రాసి గర్ల్ఫ్రెండ్ నచ్చిన తర్వాతి ఆనందాన్ని ఇంగ్లీష్ పదాలైన ఛాన్సు, రొమాన్సు, యురేకా వంటి ప్రయోగాలతో నభూతో నభవిష్యతి అన్న తరహాలో అందించాడు.ఆదికవి వాల్మీకి ‘శోకం నుంచే శ్లోకం పుడుతుంది అన్నాడు. అలాగే ఈ సినీకవి తను రాసిన పాటల్లో అద్భుతమైన సింబాలిజమ్ను అలాగే కవితాత్మను సైతం ప్రవేశపెట్టారు. సప్తపది సినిమాలోని గోవుళ్లు తెల్లన… అనే పాటలోని చరణంలో ఈ భావాన్ని అనన్య సామాన్యంగా వ్యక్తీకరించాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలనీ… అందులోంచి రసవంతమైన గేయాలు వస్తాయని భావగర్భితంగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి సినీ గేయ రచనకు కూడా నంది అవార్డును 1977లో ప్రకటించినపుడు ఆ అవార్డును వేటూరి అందుకున్నారు.సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవతా కృష్ణంరాజు నిర్మించిన 'పంతులమ్మ' చిత్రంలో రాసిన 'మానస వీణ మధు గీతం మన సంసారం సంగీతం' గీతానికిగాను అందుకున్నారు.ఆ తరువాత 'శంకరాభరణం'లోని 'శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా' గీతానికి 'కాంచనగంగ' చిత్రంలోని 'బృందావని వుంది యమునా నది ఉంది మధురాపురి ఉంది కాళింది ఉంది' గీతానికి, ప్రతిఘటన చిత్రంలోని 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే వున్నాయి.
తెలుగు సినిమా పాట దశనూ దిశనూ మార్చిన సినీకవి వేటూరి సుందరరామ మూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆయన మధుర గీతాలు అభిరుచిగల శ్రోతలను అలరిస్తూనే వుంటాయి.
http://www.teluguone.com/news/content/veturi-jayanthi-special-32-29601.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.