అవినీతి అనకొండ వల్లభనేని వంశీ.. అరెస్టుకు రంగం సిద్ధం..!

Publish Date:Nov 28, 2024

Advertisement

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుకు రంగం సిద్ద‌మైందా?  అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది.  గ‌న్న‌వ‌రం తెలుగుదేశంకార్యాల‌యంపై దాడి కేసుతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అక్ర‌మాల కేసుల్లో ఇప్ప‌టికే వంశీపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. తాజాగా మ‌రికొన్ని కేసుల విచార‌ణ స‌మ‌యంలో  వాటిలో కూడా వల్లభనేని వంశీ ప్ర‌మేయం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న్ను అరెస్టు చేసేందుకు పోలీసులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.  వైసీపీ  హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచ‌రుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  వంశీ ప్రోద్భ‌లంతో తెలుగుదేశం నేత‌ల‌పై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయించి ఇబ్బందుల‌కు గురిచేశారు. దీనికితోడు చంద్ర‌బాబు, లోకేశ్‌, వారి కుటుంబంపై వంశీ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తేల్చేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ, ఆయ‌న అనుచ‌రుల అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో  గత ప్రభుత్వ హయాంలో వంశీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై కూలంకషంగా దర్యాప్తు జ‌రుగుతోంది.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం తరఫున  ఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించాడు.  వైసీపీ అధికారంలోకి రావ‌డంతో కొద్దిరోజుల‌కే ఆయన వైసీపీకి అనుకూలంగా మారాడు. వైసీపీ  అండ‌తో వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దెత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విచార‌ణ జ‌ర‌ప‌గా నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ.. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంతగా విస్తరించి కొండలన్నీ పిండి చేశారు.  గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర   ప్రకటించారు.  రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేశారు. 

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయ‌న అనుచ‌రులు పెద్దెత్తున మోసాల‌కు సైతం పాల్ప‌డ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయ‌లు జేబులో వేసుకున్న‌ట్లు, వంశీ క‌నుస‌న్న‌ల్లోనే ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుల మోసాల పర్వం కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పుడు తాజాగా  మ‌రో మోసం వెలుగులోకి వచ్చింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం అంజయ్య .. గన్నవరం సమీపంలో చంద్రికా అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం చేసిన కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలను గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు.   ఆస్తులను విక్రయించి.. నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహనరావు, సతీష్‌లను వంశీ ప్ర‌ధాన అనుచ‌రుడు మోసం చేశారని , కాంట్రాక్టర్లు నగదు చెల్లించినా తమకు గుర్రం అంజయ్య సొమ్ములు ఎగ్గొట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తాము తమకు రావాల్సిన సొమ్ము కోసం డిమాండ్ చేస్తే  తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని కార్మికులు   ఆవేదన వ్యక్తం చేశారు. 

గన్నవరంలోని చంద్రికా అయోధ్య గృహ సముదాయం ఎదుట బుధ‌వారం భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం నేతపై దాడి కేసులో గుర్రం అంజ‌య్య‌ ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోలీసులు ఈ ఘ‌ట‌న‌పైనా కూపీ లాగుతున్నారు. ఈ మోసంలో వంశీ ప్ర‌మేయం   ఉన్న‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  మొత్తానికి వైసీపీ హ‌యాంలో అధికార మ‌దంతో విర్ర‌వీగిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచరులపై  చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధమౌతోంది. అధికారం అండతో మంచీ చెడూ లేకుండా విర్రవీగి చేసిన అన్యాయాలు, అకృత్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి తలెత్తింది. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.