త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్

Publish Date:Jul 7, 2022

Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? అలాంటి అవసరం,  అవకాశం ఉన్నాయా? అంటే, ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్నట్లు  తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్’ రాజీనామా చేసిన నేపధ్యంలో, ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా,రానున్న రోజులలో జరగనున్న గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్ర  శాసన సభ ఎన్నికలు, అదే విధంగా, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని రాజకీయ. మీడియా వర్గాల్లో గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీకి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జేడీ (యు)కు చెందిన ఆర్సీపీ సింగ్ తమ రాజ్యసభ సభ్యత్వ గడవు  గురువారంతో  ముగుస్తునందున, మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ చర్చ మరో మారు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. 

అయితే, మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికిప్పుడు ఉండే అవకాశం అయితే లేదని, జూలై 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు,  రాష్టపతి, ఉప రాష్టపతి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగష్టు రెండవ వారం తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని విస్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే, ఇద్దరు మంత్రుల రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, నఖ్వీ స్థానంలో ఆయన నిరహిస్తున్న మైనారిటీ సంక్షేం శాఖను, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి, ఆర్పీ  సింగ్ నిర్వహించిన ఉక్కు శాఖ బాధ్యతలను, జ్యోతిరాదిత్య  సింధియా అదనపు బాధ్యతలుగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా, నఖ్వీ రాజీనామాతో, కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేని పరిస్థితి, బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే, సుమారు 400 మంది వరకు ఉన్న బీజేపీ ఉభయ సభల ఎంపీలలోనూ ఒక్క ముస్లిం కూడా లేరు. అయితే, నఖ్వీని ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగష్టు 6న జారుతుంది.   గురువారం(జూలై 7)తో  నఖ్వీ రాజ్య సభ సభ్యత్వ పదవీ కాలం ముగుస్తున్నందున ఒకటి రెండు రోజుల్లో, బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో   ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నఖ్వీ పేరును ప్రకటించవచ్చని అంటున్నారు. నఖ్వీ రాజీనామాకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డను కలవడంతో , ఆయనే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అనే ఉహగానాలకు మరింత బలం చేకూరింది. 

అదలా ఉంటే, రాష్టపతి కోటా రాజ్యసభ సభ్యులుగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన  నలుగురికి అవకాశం  కలిపించడంతో, బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై గట్టిగా దృష్టి పెట్టిందని, మరోమారు  స్పష్టం అయ్యిందని అంటున్నారు. సో .. మంత్రి విస్తరణలోనూ దక్షణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి,జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఉంటుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అలోచన కూడా ఉందని అంటున్నారు. అలాగే, మెగా స్టార్ చిరజీవి పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు.

తెలంగాణ నుంచి లక్ష్మణ్ తో పాటుగా, త్వరలో బీజేపీలో చేరనున్న మరో కీలక నేత పేరు కూడా పరిశీలనలో ఉండవచ్చని అంటున్నారు. అయితే,  మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంతవరకు అధికారకంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ,  నాలుగు రోజులు అటూ ఇటుగా అయినా కేంద్ర  మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా ఉంటుందని  రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.