అవినాష్.. సీబీఐ.. ఓ అంతులేని కథ

Publish Date:May 21, 2023

Advertisement

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ, ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు వంటి వారిని అర్ధరాత్రి అరెస్టు  చేసిన సంఘటనలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్లెవరూ ఉగ్రవాదులు కాదు... రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అర్థరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, ఒక్కో చోట తలుపులు బద్దలుకొట్టి, కాంపౌండ్ వాల్ దూకి మరీ అరెస్టు చేశారు. 

టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నఉన్నారంటూ 2020 జనవరిలో  అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న  మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ కు తరలించింది. శస్త్ర చికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇందు కోసం  దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని చేశారు.

అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరు కూడా వివాదా స్పదంగానే ఉంది. ఆయన జన్మదినం రోజున అర్దరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ రోడ్డు మార్గాన ఏపీకి తీసుకువచ్చింది. దారి పొడవునా చిత్రహింసలు పెట్టిందని ఆయన ఆరోపించిన సంగతి విదితమే. అలాగే ఏపీలో విపక్ష నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పట్ల ఏపీ సీఐడీ ఇలాగే వ్యవహరించింది. నోటీసులు, పద్ధతులు, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా అరెస్టులు చేసింది. అదే వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ విషయానికి వచ్చే సరికి అన్ని అనుమతులూ ఉన్నా, అరెస్టే తరువాయి అని స్వయంగా కోర్టులకు చెప్పిన సీబీఐ ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి జంకుతోంది.

కేంద్ర దర్యాస్తు సంస్థ అయిన సీబీఐ తీరు నవ్వుల పాలౌతోంది. జనంలో ఆ దర్యాప్తు సంస్థ చులకన అవుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. విచారణకు రండి సార్ అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి బతిమలాడుకుంటోంది. అయినా కూడా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాను కాక కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పనులంటూ ఓసారి, తల్లి అనారోగ్యం అంటూ మరోసారి, ఇంకోసారి కడుపునొప్పి అంటూ స్వయంగా తానే ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా తన తల్లి ఆనారోగ్యంతో ఉన్నందున ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు హాజరు కావడానికి కుదరదని మరోసారి సీబీఐకి లేఖ రాశారు.  సోమవారం( మే10) విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మొదలైన హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు విచారణకు బయలుదేరిన అవినాష్ తల్లి ఆనోరోగ్యం సమాచారం అందిందంటూ  డుమ్మా కొట్టారు.   హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు.

 సరే సీబీఐ సోమవారం(మే 22)  విచారణకు రండి అంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన కుదరదనే సమాధానం ఇచ్చారు.  ఆయన తీరును చూస్తే.. ఇప్పట్లో ఆయన విచారణకు హాజరు కాను అని చెప్పినట్లే ఉంది.  సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో సీబీఐ చిత్తవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అవినాష్ తీరు పట్ల సీబీఐ సీరియస్ గా ఉందనీ, సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసిందనీ వార్తలు వస్తున్నా.. సీబీఐ మాత్రం గడువు మీద గడువు ఇచ్చుకుంటూ వెళుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తోందా.. లేక అవినాష్ చెప్పినట్లు చేస్తోందా అని పరిశీలకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అవినాష్ విచారణ తెలుగు టీవీ సీరియల్ లా అంతులేకుండా సాగుతోందని అంటున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.