Publish Date:Jan 29, 2025
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు సినీతారలు, రాజకీయ నాయకులు, స్వంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బిఆర్ ఎస్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్ లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే చట్ట విరుద్దం. అటువంటిది రాజ్యాంగాన్ని , చట్టాలను పరిరక్షించే న్యాయమూర్తుల ఫోన్లను బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన ఘటన మరువక ముందే తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది.
ఎస్ బి ఐ మాజీ ఓ ఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ ఇచ్చిన నివేదికలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రొఫైళ్లు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రస్తుతం హైద్రాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. వారి వ్యక్తిగత, కెరీర్ కు సంబంధించిన వివరాలు ఈ ప్రొఫైళ్లలో ఉన్నాయి. అంతే కాదు న్యాయమూర్తుల వాయిస్ రికార్డు అయ్యిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతో వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు సమాచారం. నిందితుల వాంగ్మూలాల్లో ఇద్దరు న్యాయమూర్తుల ప్రస్తావన వచ్చింది. పోలీసులకు చిక్కిన నివేదికలో వందలాది మంది ప్రొఫైళ్లు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-judges-in-phone-tapping-trap-25-192019.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.