టీటీడీ పాలక మండలి చైర్మన్ ని దింపడానికి వైసీపీకి ఎందుకంత ఆతృత? ఎందుకంత ఉత్సుకత? పదే పదే రాజీనామా చేయమని ఎందుకు చేస్తారు? తాజాగా చైర్మన్ బీఆర్ నాయుడుపై ఏఐ వీడియోలతోనూ చేసిన ప్రయోగంలో మతలబు ఏంటి? అసలింతకీ వైసీపీ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోలలో ఎముంది? టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు.. కొన్ని ఉదాహరణలు ఏకరవు పెట్టారు. అందులో భాగంగా చూస్తే గతంలో టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన వారంతా కూడా రిజైన్ చేశారనీ.. మీరు కూడా అలా చేయక తప్పదనీ భూమన అన్నారు. తిరుమల కొండ మీద గాలి కూడా పవిత్రంగా ఉండాల్సిందే అని పీవీ నరసింహరావు అన్నట్టు.. ఇక్కడొక శాసనం ఉందంటారు భూమన. ఎవరైతే అనైతిక కార్యకలాపాలకు పాల్పడతారో వారు తమకు తాము తొలగిపోవల్సిందే నన్నారు. అందుకు ఎస్వీబీసీ చైర్మన్ గా పృధ్వి ఉదంతాన్ని ఉదహరించారు. పృధ్వి ఆడియో లీక్ కాగానే జగన్ ఆయన్ను తప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత సిర్రి అప్పన్ అనే అర్చకుడు అనైతికంగా వ్యవహరిస్తే వెంటనే తొలగించారు. ఇంకా చదలవాడ, పుట్టా వంటి వారు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే టీటీడీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఉదాహరణలన్నీ చెబుతూ.. బీఆర్ నాయుడు రిజైన్ చేయాలనీ, లేకుంటే చంద్రబాబు ఆయనను తొలగించాలనీ భూమన డిమాండ్ చేశారు.
అయితే భూమనకు గట్టికౌంటర్ ఇచ్చారు బీఆర్ నాయుడు. వీరి బండారమంతా తానెక్కడ బయట పెడతానో అన్న భయంతోనే భూమన ఇదంతా చేస్తున్నట్లు ఆరోపించిన బీఆర్ నాయుడు... వీరు గతంలో టీటీడీ కేంద్రంగా చేసిన దురాగతాలన్నిటికీ సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. అవన్నీ త్వరలోనే బయటకొస్తాయని హెచ్చరించారు బీఆర్ నాయుడు. తానింత వరకూ ఆగుతూ రావడానికి గల కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే అన్నారు బీఆర్. భూమనలాంటి వారు దిగిపోమంటే దిగిపోవడానికి కాదు తానున్నదన్నారు.
తిరుమల ఉన్న ప్రాంతం నుంచే తాను వచ్చాననీ.. అదే భూమన తిరుపతికి పక్క జిల్లా నుంచి వచ్చినట్టు చెప్పారు బీఆర్ నాయుడు. అసలా వీడియోలో కనిపిస్తున్న మహిళ కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో కుటుంబ సంబంధ బాంధవ్యాలున్నట్టు చెప్పారాయన. అంతే కాదు అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో అన్నారు. ఇందులో తన పరువు తీసే కుట్ర దాగి ఉందన్న బీఆర్ నాయుడు.. తనతో పాటు టీటీడీ ప్రతిష్ట మంటగలిపే యత్నం ఉందని ఆరోపించారు. అందుకే తాను సైబర్ క్రైమ్ ని ఆశ్రయించానన్నారు. వీరిపై వంద కోట్ల పరువు నష్టం దావా వేసి.. జీవితాంతం ఈ బీఆర్ నాయుడు పేరు గుర్తుండిపోయేలా చేస్తానన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-chairman-versus-formerchairman-25-214850.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.