కేంద్రమే టార్గెట్‌గా తెరాస ప్లీనరీ తీర్మానాలు..

Publish Date:Apr 27, 2022

Advertisement

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో, మొత్తం 13 తీర్మానాలు ప్రవేశ పెడుతున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించగా, ఇతర సీనియర్ నాయకులు   బలపరుస్తూ, గంభీర ఉపన్యాసాలు చేస్తున్నారు. అయితే, తెరాస ప్లీనరీలో ప్రవేశ పెడుతున్న తీర్మానాలను గమనిస్తే, తెరాస ప్రభుత్వం సాధించిన అద్భుత విజయాల ప్రస్తావన అంతగా కనిపించలేదని, పార్టీ నాయకులు చెవులు కొరుకుంటున్నారు. కేంద్ర ప్రభుతం పై కత్తులు దూయడమే ప్లీనరీ లక్ష్యంగా కనిపిస్తోందని, ముఖ్యంగా తీర్మానాలు అన్నీ, కేంద్రం చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు.  

యాసంగి ధాన్యం కొనిగోలు వివాదం మొదలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలక భూమిక పోషించే తీర్మానం వరకు, ఏసీ వర్గీకరణ మొదలు బీసీ జనగణన తీర్మానం దాకా, ధరల పెరుగుదల మొదలు, మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు, ప్లీనరీలో ప్రవేశ పెట్టిన ప్రతి తీర్మానాన్ని, తెరాస  కేంద్ర ప్రభుత్వం, బీజేపీల పైనే గురి పెట్టింది. అదే విధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడం చేయాలని ఏకంగా ప్రత్యేక తీర్మానం చేసింది. అంటే, రానున్న రోజుల్లోనూ, తెరాస కేంద్ర ప్రభుత్వం,బీజేపీ లక్ష్యంగానే రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకుపోయే అలోచన చేస్తోందని భావించవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, తమ ప్రారంభ ఉపన్యాసంలోనూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో అమలవుతున్న క‌రెంట్ కోత‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ నిర్వాకమే కారణమని అన్నారు. అలాగే, దేశంలో ఇటీవల చోటు  చేసుకున్న మత ఘర్షణలు, వివాదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.  ఇటీవ‌లి కాలంలో దేశంలో విప‌రీత‌మైన జాఢ్యాలు, అనారోగ్య‌క‌ర‌మైన‌, అవ‌స‌రం లేవ‌నుట‌వుంటి పెడ ధోర‌ణులు ప్ర‌బలుతున్నాయ‌ని అన్నారు. భార‌త స‌మాజానికి ఇది శ్రేయ‌స్క‌రం కాదని చెప్పుకొచ్చారు. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ఆద‌రించాలి. అద్భుత‌మైన ఈ దేశంలో దుర్మార్గ‌మైన విధానాలు దేశ ఉనికినే ప్ర‌శ్నించే స్థాయికి పోతున్నాయని అన్నారు. ఈ విషయంలో ఒక రాజ‌కీయ పార్టీగా తెరాస ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, తెరాస ప్లీనరీలో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోందని పరిసీలాకులు అంటున్నారు. 

అయితే, కేంద్రంతో నిరంతర కయ్యం వలన తెరాసకు రాజకీయ ప్రయోజనం చేకూరినా, చేకురక పోయినా రాష్ట్రం నష్టపోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి సాగిన యాసంగి వరి వివాదం వలన రాష్ట్ర ప్రభుత్వం, తెరాస సాధించింది ఏమీలేక పోయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగిన వివాదం కారణంగా రాష్ర్  రైతాంగం భారీ మూల్యం చెల్లించిందని గుర్తు చేస్తున్నారు. పంట వేయక కొందరు, వేసిన పంటను ప్రభుత్వం కొనదనే భయంతో కొందరు మిల్లర్లు తక్కువ ధరకు విక్రయించి ఇంకొందరు రైతులు నష్ట పోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలను, పరిపాలనా సంబంధాలను వేరువేరుగా చూడవలసిన అవసరం ఉందని, అలా కాకుండా అయిన దానికీ, కాని దానికీ కయ్యానికి కాలు దువ్వితే చివరకు నష్ట పోయేది, మూల్యం చెల్లించేది ప్రజలే అని, ఆ పరిస్థితి రాకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కట్టుబాటు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అయితే, ప్లీనరీ తీర్మానాల తీరు చూస్తే, ముందు  ముందు  రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలే కనిపిస్తున్నాయే, కానీ, తగ్గే సూచనలు అయితే అసలు కనిపించడం లేదు.

By
en-us Political News

  
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.