Publish Date:May 12, 2022
పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడి బొడ్డున ఏకంగా ఎకరం భూమి కేటాయించింది. మార్కెట్ దార ప్రకారం ఈ భూమి విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా.
ఒక వైపు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూములు అందుబాటులో లేవని చెబుతున్న ప్రభుత్వం సొంత పార్టీ ఆఫీస్ కోసం మాత్రం ప్రైమ్ ఏరియాలో దాదాపు ఎకరం భూమిని కేటాయించడం అధికార కబ్బా తప్ప మరొకటి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం ప్రభుత్వం నగరంలో అత్యంత లగ్జూరియస్ ఏరియాలలో ఒకటైన బంజారా హిల్స్ లో ఏకంగా 4539 గజాల స్థలాన్ని కేటాయింది. ఈ కేటాయింపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనికి అధికారిక కబ్జాగా అభివర్ణిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇలా భూ కబ్జాలకు వినియోగిస్తున్నదని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. దొడ్డిదారి జీవోలతో అత్యంత విలువైన భూమిని పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టడం భూ దొపిడీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ధారణకు రావడం వల్లే తెరాస అధినేత పార్టీకి ఇలా అడ్డగోలుగా విలువైన భూమిని ధారాదత్తం చేశారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరాస సర్కార్ అడ్డగోలుగా భూ పందేరానికి తెరలేపిందనీ, పార్టీ వ్యక్తులకు, అస్మదీయులకు ప్రభుత్వ భూమినీ, అసెన్డ్ భూములను కట్టబెడుతోందని విమర్శలు వినవస్తున్నాయి.
వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి రెడ్ ఫోర్డ్ పేరిట కట్టబెట్టిందనీ, రియల్ వ్యాపారం కోసం అసైన్డ్ భూములనూ వదలడంలేదని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది. మరో వైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం విలువైన భూమిని కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ అక్రమ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-official-land-grab-in-name-of-party-office-25-135774.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.