11వ వార్షికోత్సవం పేరిట టి.ఆర్.ఎస్. వసూళ్లు
Publish Date:Apr 20, 2012
Advertisement
తెలంగాణా రాష్ట్ర సమితికి పెద్దఎత్తున నిధుల వసూళ్ళకు మరో ఛాన్స్ వచ్చింది. రంగారెడ్డిజిల్లా వికారాబాద్ పట్టణంలో టి.ఆర్.ఎస్. 11వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎలా లేదన్న రెండు కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం కనీసం 20 కోట్లు వసూళ్లు చేయాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యాపారసంస్థల యజమానులకు ఫోన్లు చేస్తున్నారు. పెద్ద పరిశ్రమలకు ఐదు లక్షలు, మధ్యతరహా పరిశ్రమలకు రెండు లక్షలు, చిన్నతరహా పరిశ్ర మలకు 50వేల రూపాయల చొప్పున రేటు నిర్ణయించి వసూళ్లు ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన జరిగే ఈ 11వ వార్షికోత్సవ సంబరాలకు తెలంగాణా నుంచి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని నిర్వాహకులు అంటున్నారు. అయితే పరిశ్రమల యజమానులు ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు విద్యుత్తుకోట కారణంగా నష్టాలపాలవుతున్నాయి. అయినా టి.ఆర్.ఎస్. నేతలు మాత్రం నిర్దయగా వసూళ్లు చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వనని మొండికేస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారసంస్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-collecting-money-for-11th-party-formation-day-24-13497.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





