Publish Date:Apr 29, 2020
ఆర్ధరైటిస్ చికిత్సకు వాడే TOCILIZUMAB ను క్లిష్ట పరిస్ధితులలో ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్న covid రోగులకు వాడవచ్చునట. ఫ్రాన్స్ లో నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విషయం ఇంచుమించుగా నిర్ధారణ అయినట్టే.ఇది పక్కా చికిత్స కాకపోయినా ప్రాణనష్టాన్ని నివారించేందుకు,,ఆపై ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా పనికి వస్తుంది.ఫ్రాన్స్ లో 129 మంది తీవ్ర రోగులలో సగం మందికి ఇంజక్షన్ చేయగా మంచి గుణమే కనిపించింది ..ఈ మందు ACTEMERA,రో ACEMETRA పేర్లతో
ప్రాచుర్యం పొందింది...
భారతీయులకు BCG, సూర్యరశ్మి వరాలే
భారత దేశంలో పౌరులందరికీ BCG వాక్సిన్ ఉంటుంది గనుక కరోనా నియంత్రణలో భారతీయులు దృఢంగా ఉన్నారని అమెరికాలో స్థిరపడిన భారతీయనిపుణుడు రవి గాడ్సే అభిప్రాయపడ్డారు.అలాగే ఇండియాలో ఇప్పటికే మొదలైన ప్లాస్మా థెరపీ కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన చెప్పారు.కాకపోతే covid వచ్చి తగ్గిన వారి నుంచి కాక అసలు ఆ జబ్బు రాని ఆరోగ్యవంతుల రక్తం నుంచి రెండు మూడు వారాల ముందే సేకరించే కణాలను చికిత్సకు వాడే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు.
ఇక భారత్ లో వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుతూ సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలలో వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని రవి అభిప్రాయపడ్డారు.తేమ ఎక్కువగా ఉండేటప్పుడు మనిషి నుంచి వెలువడే తుప్పర్లలో అధిక శాతం తొందరగా భూమిపై పడి ప్రభావం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.వాతావరణ పరిస్థితులతో పాటు భారత ప్రభుత్వం ముందుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం,అది అమలు జరుగుతున్న విధానం మేలు చేసి ఇండియా మూడో దశకు వెళ్లే ప్రమాదం నుంచి బయటపడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు..ఇప్పుడు అమెరికా తెరిపిన పడుతోంది గనక రానున్న రోజుల్లో భారత్ లో కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా HCQ విషయంలో ఇండియా చేసిన సాయానికి కృతజ్ఞతగా USA ఖచ్చితంగా రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.
ఒకసారి వచ్చి తగ్గిన వారికి అంత త్వరగా రోగం తిరగబెట్టే అవకాశాలు తక్కువేనని రవి అన్నారు.అలాగే కరోనా స్వభావం మార్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అది మంచికే దారి తీస్తుందని ఆశించవచ్చన్నారు.ఈలోగా వాక్సిన్ కూడా సిద్ధం అవుతుందనే సానుకూల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని పేర్కొన్నారు.కాగా లక్షణాలు కనిపించే వారిని క్వారెంటైన్ కు పంపుతూ ఇమ్యూనిటీ పరీక్షలు జరిపి ఫిట్ అయిన వారిని రంగంలోకి దింపి ఆర్థిక పునర్నిర్మాణం దిశగా భారత్ వడివడిగా అడుగులు వేయవచ్చని ఆయన చెప్పారు.ఏదిఏమైనా కరోనా బారిన ఎందరు పడినా 90 శాతం మందిపై అది పెద్దగా ప్రభావం చూపదని,అయిదు శాతం మంది ఖచ్చితంగా కోలుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tocilizumab-coronavirus-treatment-39-98498.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.