బీఆర్ఎస్‌లో ఆ 40 మంది.. కేసీఆర్ కు సెగ!

Publish Date:Jun 21, 2023

Advertisement

చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గిర్రున తిరిగిపోయాయి. నిన్నకాక మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినట్లుగా ఉన్నా.. అప్పుడే నాలుగున్నరేళ్ళు గడిచి మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసింది. మళ్ళీ ఈసారి కూడా ఎలాగైనా తానే అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించేసుకుంటున్నారు. నిండా ఆరు నెలలే ఎన్నికలకు సమయం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీలో క్యాండిట్ల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఈసారి కూడా సిట్టింగులకే అవకాశం ఇస్తానని గులాబీ బాస్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినా.. బీఫామ్ చేతిలో పడే వరకు నమ్మలేమంటూ చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సిట్టింగులకే టికెట్లు అని చెప్పినా కొందరిపై మాత్రం అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టి గమనిస్తున్నట్లు పార్టీలో అంతర్గత సమాచారం.

ఇప్పుడున్న రాజకీయాలలో ఎన్నికలంటే ముందుగా గుర్తొచ్చేది సర్వేలు. ఏ పార్టీకి ఆ పార్టీ అవకాశాలను అంచనా వేసేందుకు ఈ సర్వేలు చేయిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రెండేళ్ల ముందు నుండే ఈ సర్వేల పని మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సర్వేలు చేయించిన కేసీఆర్.. వర్కింగ్ స్కోర్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా చేశారు. ఎన్నికలకు ఏడాది ముందే కేసీఆర్.. నెగటివ్ మార్క్ ఎమ్మెల్యేలకు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చారట. పనితీరు మెరుగు పరుచుకోలేకపోతే మీ స్థానంలో వేరేవాళ్లని దింపాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలే చేశారని పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి. వారిలో కొందరు బాస్ చెప్పినట్లే నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటే మరికొందరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయారు.

అలా పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు, పథకాల అమలును పట్టించుకోని ఎమ్మెల్యేలు, ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేల ప్రభావం ఇప్పుడు ఏకంగా అధిష్టానాన్ని తాకుతుందా అనిపిస్తుంది. ఎమ్మెల్యే తీరు నచ్చక ప్రజలు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ పార్టీపైనే చూపిస్తుంది కదా. ఇప్పుడు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అందని ప్రజలు నిరసనలు చేస్తూ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఉత్సవాలలో పలుచోట్ల ప్రజలు రకరకాల అంశాలపై నిరసనలు వ్యక్తం చేయగా.. నిన్నటికి నిన్న తాగునీటి ఉత్సవాలు జరుగుతుంటే.. కొన్ని చోట్ల ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మాకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావంటూ ధర్నాలకు దిగారు. ధరణి పోర్టల్ నుండి దళిత బంధు వరకు పలు చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలను గాలి కొదిలేసినట్లే అధిష్టానం భావిస్తోంది. ఇలాంటి వారిలో ఇప్పటికే 40 మందితో ఒక జాబితా కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది.

ఇలా అసమర్ధ ఎమ్మెల్యేలుగా గుర్తించిన ఈ 40 మంది వలన ఇప్పుడు అధిష్టానానికి కూడా తలనొప్పులు కాగా.. ఈసారి ఈ 40 మందికి సీట్లు కేటాయించే పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాల భావన. అందుకోసమే ఇప్పటికే కేసీఆర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టించారట. వాళ్ళ కదలికల నుండి సమావేశాల వరకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధిష్టానం.. వీరు టికెట్ దక్కకపోతే ఏ పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ ఉందో కూడా అంచనాలు సిద్ధం చేసి అటాక్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. జూలై లేదా ఆగస్టులో మొదటి విడత జాబితాను విడుదలచేయాలని కూడా డిసైడ్ అయిన గులాబీ బాస్.. సుమారు 60-70 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

తొలి జాబితా ప్రకటనతో పాటు ఈ 40 మంది అసమర్ధ ఎమ్మెల్యేల స్థానంలో ఇంచార్జిలకు అనధికారికంగానే హామీలు ఇచ్చే అవకాశం ఉండగా.. ఆయా స్థానాలలో ఆశావహుల జాబితా కూడా భారీగానే ఉండనుంది. వీలైనంత త్వరగా ఈ 40 మంది ప్రభావాన్ని తగ్గించేందుకు సిద్ధపడిన కేసీఆర్.. వీరు రేపు రెబల్స్ గా మారితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా ముమ్మర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.