Publish Date:Jun 17, 2022
కుందేళ్లు, ఎలుకలు పగదీర్చుకోవడం జానపదకథల్లో చదివాం. రాకుమారుడికి అతని ప్రేయసి వున్న చోటు పూర్వం ఒక కుందేలే చూపించడం వంటి చందమామ కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. అవి నిజంగా జరిగాయో లేదో తెలీదుగాని పాఠకులకు మాత్రం కథ పట్ల ఉత్సాహాన్ని రెట్టింపుచేస్తాయి. ఎలు కలు మద్యం తాగాయి, గోడౌన్లలో బియ్యం తినేశాయన్న కథలూ అప్పుడప్పుడూ పేపర్లలో చదువుతూం టాం. కానీ ఒక ఎలుక నిజంగానే దొంగలా దొరికింది! ఈ దొంగ ముంబాయిలో ఏకంగా బంగారం వున్న కవరుతో దొరికింది!
అసలే బంగారం ఖరీదు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముంబాయిలో ఓ పెద్దావిడ తన వద్ద వున్న బంగా రాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేయాలని బయలుదేరింది. దారిలో పిల్లలు ఆడుతూ కనిపించారు. వారికి ఆమె చేతిలో వున్న బ్రెడ్ ఇవ్వాల్సింది పొరబాటున బంగారం వున్న కవర్ ఇచ్చేసింది. పిల్లలు ఆట గోల లో ఆ కవర్ని రోడ్డు పక్కన వుండే చెత్త కూపలో పడేయమని ఇచ్చిందేమో అనుకున్నారు. అసలు ఆ కవర్లో ఏముందో కూడా చూడకుండా చెత్తకుప్పలోకి విసిరేసి వెళిపోయారు. అది ముంబయి గోకుల్ధామ్ కాలనీ ప్రాంతం. ఆ చెత్తకుప్ప వద్దకు వచ్చిన ఎలుక సరిగ్గా ఆ బంగారం వున్న కవర్నే పట్టుకుని కొరికింది. అది ఏదో తినే పదార్ధమనుకున్నది. కొరకబడలేదు..దూరంగా తీసికెళ్లి మరో ప్రయత్నం చేయాలనుకుందో ఏమో ఆ కవర్ని నోటితో గట్టిగా మరో పట్టుపట్టి తనవల్ల కాక అక్కడే వదిలేసి పోయింది. పోలీసులు అక్క డికి వచ్చి ఆ బంగారాన్ని రికవర్ చేసుకున్నారు.
ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎలుక తతంగాన్ని పట్టేసాయి. అది ఇచ్చిన పెద్ద సాక్ష్యంతో పోలీసులు ఈ చిన్ని దొంగ తతంగాన్ని గుర్తించి పరుగున వెళ్లి బంగారం కవర్ని పట్టేసారు. పిల్లలే వది లేసిన కవర్లో తను పట్టుకున్న కవర్లో ఎంతో విలువయిన బంగారం వుందన్న సంగతి దానికి తెలియదు, తెలిసినా వాటి సంగతి దానికి అనవసరం, తినేదయితే ఈపాటికి తినేసేదే. అది కొరుకుడు పడలేదు కాబట్టి వదిలేసి పారిపోయేదే! ఆ చోరీ సత్తు రికవరీ అయింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-rat-gold-thier-25-137845.html
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.