Publish Date:May 15, 2025
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే. అయితే భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. భారత్, పాక్ ల విషయంలో ట్రంప్ చేసిందేమీ లేదని మోడీ నిష్కర్షగా చెప్పేశారు. అయినా భారత్ అన్ని విధాలుగా అప్పర్ హ్యాండ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందా అన్న విస్మయం ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది. ఇక దేశంలో అయితే ప్రధాని మోదీ నిర్ణయంపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. విమర్శలూ వెల్లువెత్తాయి.
ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడానికీ, కాల్పులు ఆపండి మహప్రభో అంటూ పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ ఆపరేషన్లలో భాగంగా పాకిస్తాన్ అణు స్థావరమైన కిరానాహిల్స్ సమీపంలోని సర్గోదా ఎయిర్ బేస్ పై క్షిపణి దాడి చేసింది. కిరానా హిల్స్ నుంచి 20 కి.మీ వరకూ సోరంగాలు ఉన్నాయి.భారత్ క్షిపణీలు సర్దోదా ఎయిర్ బేస్ పక్కన ఉన్న సోరంగంలోని అణువార్ హెడ్స్ ను తాకాయి. దాంతో రేడియేషన్ లీక్ అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందనీ, భారత్ కు కాల్పుల విరమణకు అంగీకరించి.. రేడియేషన్ లీక్ ను ఆపుకునేందుకు తమకు వెసులుబాటు కల్పించాలనీ బతిమ లాడుకుంది.
ఆ కారణంగానే భారత్ కాల్పులు విరమణకు అంగీకరించిందనీ తెలుస్తోంది. రేడియేషన్ లీక్ అయ్యిందనీ, ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేవారంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ జీవో జారీ చేసింది. ఇదే విషయాన్ని భారత్ కు తెలియజేసి కాల్పుల విరమణకు ఒప్పించిందని తెలుస్తోంది. పాక్ పౌరుల ప్రాణ రక్షణ కోసమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందన్న ప్రశంసలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుద్ధరంగ నిపుణులు భారత్ పై ప్రశంసలు కురిపించడం, భారత్ సంయమనాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-real-reason-behind-cease-fire-39-198083.html
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ అనే ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ హైదరాబాద్లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు.
తెలంగాణ మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మాగంటి మృతదేహానికి చూసి కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీని కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు మంత్రులు చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా
సానుభూతి కానరావడం లేదు!
వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు,
జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు.
తిరుమల జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.