ప్రత్యేక తెలంగాణా ఇక లేనట్లేనా ?

Publish Date:Jul 28, 2012

Advertisement

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇక లేనట్లే. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకూ ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ముందుంచుతామన్న కేంద్రం ఇక ఒకవైఖరి ప్రకటించేయాలని నిశ్చయించుకుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను భౌగోళికంగా విడదీయలేమని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించింది. నదులు, నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా అతిచిన్నరాష్ట్రంగా తెలంగాణా ఏర్పడితే నిధుల కొరతే కాకుండా ఎన్నో కొత్తసమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ఈ ప్రత్యేకతెలంగాణా గురించి అథ్యనం చేసిన జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ తన ఆరోసిఫార్సులో యథాతథస్థితి కొనసాగింపు అంశాన్నే హోంశాఖ బలపరిచింది.


తెలంగాణా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆర్థికభద్రత, సామాజికరక్షణ, చట్టపరమైన చర్యలు ద్వారా పరిష్కారం వెదకవచ్చని స్పష్టం చేసింది. మరో రెండేళ్లలో రాష్ట్రంలో తెలంగాణా అభివృద్థిపై ఒక స్పష్టతతో కూడిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడిరది. ఈ నివేదికను ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లోపు బహిరంగపరచాలని కూడా హోంశాఖ భావిస్తోంది. అయితే నివేదిక ఇచ్చే అథికారం హోంశాఖకు లేదని, మొత్తం కేబినెట్‌ పరంగానే రాష్ట్రపతికి నివేదిక పంపాలని మాజీ ఎంపి, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వినోద్‌ అంటున్నారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని హోంశాఖ చర్యను ఆయన ఖండిరచారు.



ఇప్పటికే తెలంగాణా జెఎసి ప్రత్యేకరాష్ట్రం కోరుతూ ఆందోళనలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అయితే ఈ ఆందోళనకు వెళ్లేందుకు ప్రజలు సముఖత వ్యక్తం చేయటం లేదు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుంది అనవసరంగా ఆందోళనలకు దిగొద్దని టిఆర్‌ఎస్‌ అథినేత కెసీఆర్‌ ఇచ్చిన పిలుపు తెలంగాణావాదులను వెనక్కి తగ్గేలా చేసింది. అందువల్ల టిజెఎసికి స్పందన కొంతమేరకు తగ్గింది. అయితే విద్యార్థులు మాత్రం మొదటి నుంచి యథాప్రకారం ఆందోళనలకు సిద్ధమవుతూనే ఉన్నారు. వారు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పరిథిలో లేరు. ఎందుకంటే వారు మొదటి నుంచి ప్రతీఅంశాన్నీ నేరుగా పరిశీలించి ప్రత్యక్షచర్యలకు సిద్ధమవుతున్నారు.



ఇప్పుడు కేంద్రహోంశాఖ నిర్ణయంపై కూడా వీరి నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఒకరకంగా టిఆర్‌ఎస్‌ అదుపుతప్పిందనటానికి విద్యార్థుల పోకడే నిదర్శనంగా తీసుకోవచ్చు. ప్రత్యేకతెలంగాణా ఉండబోదన్న నిర్ణయం జైఆంథ్రా ఉద్యమంలో పాల్గొన్న వృద్ధులూ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రెండిరటిని ప్రభుత్వం అదుపు చేయగలిగితే కేంద్రం నివేదిక రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకి అవటం వల్ల సమైక్య ఆంథ్రా వర్ధిల్లుతుంది. కేంద్రం నివేదిక పట్ల సమైక్యాంధ్ర  సులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు రాష్ట్రపతిని తన వైఖరి మార్చుకోకుండా తెలుగుజాతిని కాపాడాలని కోరుతున్నారు.


 

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.