Publish Date:Jun 17, 2025
ఎయిర్ ఇండియా విమానాలలో తరచుగా కేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం (జూన్ 17) తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి బయలుదేరిన మ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు.
బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం శాన్ ఫ్రాన్సిస్కోనుంచి బయలుదేరి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.45 కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం తెల్లవారు జామున రెండు గంటలకు ముంబైకి బయలుదేరాల్సి ఉంది. అయితే.. విమానం ఎడమ ఇంజిన్లో సాంకేతిక లోపం గుర్తించడంతో విమానం టేకాఫ్ లో విపరీతమైన జాప్యం జరిగింది. లోపం సవరిం చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయా ణీకులందరినీ విమానం నుంచి దించివేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/technical-lapse-in-another-airindia-flight-39-200110.html
గాంధీ భవన్లో జరిగిన తెలంగాణ ప్రదేశ్ కమిటీ సమావేశంలో కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా భూ సమస్యలు పరిష్కారస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది.
ప్యాంటు జేబులో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన హైదరాబాద్, అత్తాపూర్లో జరిగింది. ఈ ఘటనలో యువకుడి తొడకు గాయాలయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పాలన కేంద్రం ఆత్మకూరులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఏరాసు ప్రతాపరెడ్డి పై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు.
హైదరాబాద్ లక్డీకాపూల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్నిఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్వస్థతకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో గురువారం (జులై3 ) చేరిన సంగతి తెలిసిందే. ఆయన కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య అనే స్థానికుడి ప్రాణం పోయింది. ఆ వివాదం ముదిరింది. దానిపై రాజకీయ రచ్చ తీవ్రస్థాయికి చేరింది. ఇష్యూ చల్లారిపోయిందనుకున్న ప్రతిసారీ.. మళ్లీ రాజుకుంటోంది.
లక్ష క్రాస్ అయినట్టు కనిపించిన బంగారం ధరలు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేలకు పడిపోనున్నాయా? అన్నది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థలు కూడా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టే ఛాన్సుందని చెబుతున్నాయి.
శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. కానీ పైరసీకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఉపాయం కూడా కనుగొనలేక పోవడం విచారకరం. పైరసీని అరికట్టడం ఎలా ఉన్నదే ప్రస్తుతం టాలీవుడ్ జనాలను వేధిస్తోన్న ప్రశ్న.
జపాన్ మాంగా కళాకారిణి రియో టాట్సుకీ.. జూలై ఐదున జపాన్ కి భారీ సునామీ రానుందని చెప్పడంతో.. ఎందరో తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా జపాన్ టూరిజం పడకేసింది.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జులై 4) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.