తెరాస మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఏ ముహూర్తంలో ఏపీలో జగన్ ఏటుబడిలో విద్యుత్, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అన్నారో కానీ.. రోజు రోజుకూ ఆయన మాటలు అక్షర సత్యాలనడానికి నిదర్శనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిస్కమ్ లు దివాళా అంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. వైసీపీ నేతలు కేటీఆర్ కు విసిరిస సవాల్ ను తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కనులారా చూద్దురు గాని రండి అంటూ ఆహ్వానం పలికిన వైసీపీ మంత్రులు ఆ తరువాత మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. మాట వరసకు వందల బస్సుల్లో రండి రాష్ట్రంలో అభివృద్ధి ‘వెలుగులు’ చూపుతాం అని ఓ సవాల్ విసిరి వదిలేశారు. మళ్లీ మళ్లీ సవాల్ చేస్తే తెలంగాణ నుంచి మంత్రులు బస్సులేసుకు వచ్చేస్తారేమోనని భయపడినట్లు ఉన్నారు. ఒక వైపు డబ్బులు లేవు మహప్రభో అంటూ కోర్టులకు విన్నపాలు చేసుకుంటూ చెల్లింపులను చెల్లు చేసేయాల్సిందిగా కోరుతూ.. మరో వైపు అభివృద్ధి పరుగులు అంటూ పొరుగు రాష్ట్రం మంత్రులకు సవాల్ చేయడం వైసీపీకే చెల్లింది. జగనన్న మాటల్లాగే ఈ సవాల్ కూడా నాలుక చివర నుంచి వచ్చిందే తప్ప.. పొరుగు రాష్ట్రం మంత్రులకు నిజంగా ఆహ్వానం పలికే దమ్మూ ధైర్యం వైసీపీ మంత్రులకు లేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం.. ముందుకు వచ్చి ఆహ్వానం వైసీపీది అయితేనేం.. మే స్వాగతిస్తున్నాం రండి అంటూ పొరుగు రాష్ట్రానికి స్వాగతం పలికింది.
మీరు రావడం కాదు మేం తీసుకువస్తామంటూ ముందుకు వచ్చింది. ఒక్క తెలంగాణ నుంచే కాదు.. ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచీ, ఇంకా కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ నేతలు, ప్రముఖులను తీసుకువచ్చి రాష్ట్రంలో ‘వెలిగిపోతున్న’ అభివృద్ధిని చూపిస్తామంటోంది.ఈ మేరకు తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను దగ్గరుండి మరీ చూపిస్తామని చెబుతున్నారు. సీపీఐ నాయకుడు నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర పరిస్థితులను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి, పాలనా వైఫల్యాలు .. విధాన లోపాలను బయటపెట్టే ఉద్దేశంతో వైసీపీ నేతల ఆహ్వానాన్నే ఉపయోగించుకోవాలని తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నేతలను ఏపీకి తీసుకొచ్చి వారికి రాష్ట్ర పరిస్థితులను చూపి సమస్యల తీవ్రత ను లోకానికి తెలియజేయాలని యోచిస్తోంది. ఈ యోచనను తెలుగుదేశం కార్యరూపంలోనికి తీసుకువస్తే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం జరుగుతుంది. టీడీపీ దూకుడు చూసి వైసీపీ మంత్రులు ఎందుకు సవాల్ చేశామురా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-responds-tp-ycp-invitation-39-135483.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.