బైరెడ్డి సాధించిందేమిటీ?
Publish Date:Jul 30, 2012
Advertisement
ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం కావాలనే డిమాండుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేస్తున్న ఉద్యమం వల్ల సాధించిందేమిటీ? ఈ ప్రశ్న ఒక్క పార్టీ కాదు యావత్తు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తోంది. అయితే వాస్తవానికి తెలంగాణా ఇంక ఇవ్వలేమన్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావటానికి ఈయన చేపట్టిన ఆందోళనే కీలకమయిందని ఆ పార్టీ నేతలంటున్నారు. వేర్పాటువాదం వల్ల వచ్చే ప్రమాదాన్ని బైరెడ్డి చేసిన ఉద్యమాల వల్ల అర్థం చేసుకున్న కాంగ్రెస్ ఇక త్వరలో బయటపడేందుకు సిద్ధపడుతోంది. అయితే హోంశాఖ నివేదిక అవాస్తవమైనా కూడా ప్రత్యేక తెలంగాణా ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మాత్రం సిద్ధంగా లేరన్నది వాస్తవం.
అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బైరెడ్డి తన తోటి రాయలసీమ వాసులందరినీ కూడగట్టుకుని అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా అయినా చేస్తాను కానీ, ప్రత్యేక రాయలసీమ సాధించేంత వరకూ విశ్రమించనని ప్రకటించారు. తమ రాయలసీమ పౌరుషాన్ని, తమ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన ప్రకటించిన తీరు తెరాసకు ఒళ్లు మండేలా చేసింది. దీంతో అక్కసు ఆపుకోలేక తమ తెలంగాణా రాయలసీమ నుంచి బైరెడ్డి ఒకరని టిఆర్ఎస్ ప్రకటించేసింది. ప్రత్యేకించి ఉన్నదీ, లేనిదీ అవాకులు, చవాకులు పేలే హరీశ్రావు బైరెడ్డిపై కోపాన్ని విమర్శల రూపంలో కక్కేశారు. అయితే బైరెడ్డి ఉద్యమబాట పట్టకపోతే తెలంగాణా వచ్చేసేదని టిఆర్ఎస్ ప్రచారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏమి సాధించలేదంటారే ఒక కొత్తశత్రువులను ఏర్పాటు చేసుకుని మాతృభూమిలో మందిని సమకూర్చుకుంటే చాలదా అన్నట్లుంది బైరెడ్డి బాణి.
http://www.teluguone.com/news/content/tdp-leader-baireddy-24-16061.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





