Publish Date:Apr 17, 2026
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏకంగా ఎనిమిది మందికి అధిష్టానం పదవులు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నెలకొంది. టీడీపీ వారికి లభించిన ప్రాధాన్యత చూస్తూ పల్నాడు వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారిని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక పదవుల్లో నియమించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఇప్పటికే పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్గా తీసుకోవడంతో పార్టీలో పెద్ద పీట వేసినట్లైంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జాతీయ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
మంత్రి పదవి ఆశించిన ఆ సీనియర్ నేతకు పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జోనల్ కోఆర్డినేటర్గా పదవులు దక్కించుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రత్తిపాటి ఈ సారి జోనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. అలాగే సత్తెనపల్లికి చెందిన మన్నెం శివనాగమల్లేశ్వరారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్ధిగా, పెదకూరపాడు నేత మద్దిరాల గంగాధర్ , చిలకలూరిపేట మైనార్టీ నేత షేక్ కరీముల్లా, వినుకొండ మైనార్టీ లీడర్ షమీమ్ఖాన్లకు రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు దక్కాయి.
మద్దిరాల గంగాధర్ పార్టీకి విధేయుల. తన వాక్చాతుర్యంతో అధిష్టానం గుడ్ లుక్స్లో ఉన్న ఆయన ఇప్పటికే రాష్ట్ర నాయీ బ్రాహ్మణ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. షమీమ్ ఖాన్, షేక్ కరీముల్లాలకు కార్యదర్శి పదవులు దక్కడంతో పల్నాడులో గణనీయంగా ఉన్న మైనార్టీలకు ప్రాధాన్యత దక్కినట్లైంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన శివనాగలమల్లేశ్వరరావు గత మూడు సార్లుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టికెట్ రాక పోయినా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రస్థాయి కమటీలోకి తీసుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో వైసీపీ కమిటీలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే జగన్ కొనసాగిస్తున్నారు.
2024 ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆయన జిల్లా అధ్యక్షుడి ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నికల హింస కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన పిన్నెల్లి పెద్దగా జనంలోకి రావడం లేదు. దాంతో పిన్నెల్లి స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని జిల్లా వైసీపీ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే జగన్ మాత్రం పిన్నెల్లి వైపే చూపుతుండటం, ఆయన కేసుల భయంతో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటంతో జిల్లా వైసీపీకి పెద్దదిక్కు కరువైన పరిస్థితి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం పాలవ్వడం, సమర్ధమైన నాయకత్వం కరువవ్వడంతో అక్కడి కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో పల్నాడు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత పెరుగుతుండటంతో వైసీపీ వర్గాల్లో అంతర్మధనం మొదలైందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-is-dominant-in-palnadu-district-39-217597.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.