తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని చల్లార్చని మంత్రి పార్థసారథి క్షమాపణలు

Publish Date:Dec 18, 2024

Advertisement

దేశ రాజకీయ చరిత్రలో కార్యకర్తలే అండగా నిలిచి నిలబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. గెలుపు, ఓటములను చూఃసింది. ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా నిలిచారు. పలు సందర్భాలలో పార్టీకి నేతలు దూరమైనా కార్యకర్తలే పార్టీని భుజాన మోశారు. 

ఈ నలభై రెండేళ్ల ప్రస్తానంలో తెలుగుదేశం ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది.   పార్టీలోకి ఎంత మంది వచ్చినా వారందరినీ అక్కున చేర్చుకొని రాజకీయ ఓనామాలు దిద్దించింది.  క్రమశిక్షణతోపాటు రాజకీయంగా జీవితంలో ఎలా ఎదగాలి... ఆ ఎదిగే క్రమంలో ఎలా ఒదిగి ఉండాలో ఓ తల్లిగా.. ఓ తండ్రిగా.. ఓ గురువుగా..   జీవిత పాఠాలను నేర్పించింది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని కాల పరీక్షకు నిలబడి ఠీవీగా తలెత్తుకు నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.  పార్టీ పని అయిపోయిందంటూ ఇతర పార్టీలు గేలి చేసి.. గోల చేసిన ప్రతి సారి.. గతం కంటే మిన్నగా, గొప్పగా పుంజుకుని పడి లేచిన కెరటంలా నిలబడిన పార్టీ తెలుగుదేశం. పలు సందర్భాలలో ఆ పార్టీకి.. పార్టీ నుంచి అన్నీ పొందిన నేతలు ద్రోహం చేశారు. కష్టకాలంలో పార్టీని వీడి సొంత లాభం చూసుకున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెలకు హత్తుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు. అధినాయకత్వంపై నమ్మకం ఉంచారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీట. కార్యకర్తల విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత సంగతి అటుంచి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితిని మంత్రి కొలసు పార్థ సారథి ఎదుర్కొంటున్నారు.  

కొలుసు పార్థసారథి వైసీపీ సీనియర్ నాయకుడు.   2019 నుండి 24 వరకు పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అది గతం. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి గుడ్ బై చ8ెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. అందుకు ప్రధాన కారణం కొలసు పార్థసారథి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ ఆయనకు కేబినెట్ లో చోటు ఇవ్వలేదు సరికదా.. 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా నిరాకరించారు.  దీంతో ఆయన జగన్ పై తిరుగుబాటు చేసి.. వైసీపీకి గుడ్ బై చెప్పి  ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.  అయితే ఆయన చేరికకు తెలుగుదేశం క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట మన్నించి ఆయనను పార్టీలోకి అంగీకరించారు.  దీంతో తెలుగుదేశంలో ఎంట్రీ ఇచ్చిన కొలసు పార్థసారథి ఆ పార్టీ అభ్యర్థిగా  నూజివీడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా స్థానం సంపాదించారు. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు కేబినెట్ బెర్త్ దొరికింది.   అయితే మంత్రిగా ఆయన వ్యవహారశైలి పట్ల, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, వైసీపీ నుంచి తనతో పాటుగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తుండటం పార్టీ క్యాడర్ లో అసంతృప్తి జ్వాలలు రగలడానికి కారణమైంది. ఈ విషయాన్ని పలు మార్లు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది.   తెలుగుదేశం సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని కూడా కొలసు పార్థసారథిపై పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో ఆయన ఒక కార్యక్రమంలో వైసీపీ నాయకుడు  జోగి రమేష్‌తో వేదిక పంచుకోవడం పెద్ద రచ్చకు దారి తీసింది.

మూడేళ్ల కిందట  చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసులో ఏ1గా ఉన్న జోగి రమేష్‌తో కొలసు పార్థ సారథి వేదిక పంచుకోవడాన్ని తెలుగుదేశం క్యాడర్ సహించలేకపోతున్నారు. ఈ కార్యక్రమంలో గౌతు శిరీష కూడా పాల్గొన్నప్పటికీ.. ఆమె పార్టీ క్యాడర్ కు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో జోగు రమేష్ పాల్గొంటారన్న సమాచారం తనకు తెలియదని పేర్కొననారు. అయితే కొలసు పార్థసారథి కూడా క్షమాఫణలు తెలిపినప్పటికీ తెలుగుదేశం క్యాడర్ లో ఆయనపై ఆగ్రహం చల్లారలేదు. ఆయన చాలా రొటీన్ గా జోగు రమేష్ తో వేదిక పంచుకోవడంపై ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారన్న భావనే పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.  మంత్రి కొలసుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.