టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య.. ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు

Publish Date:Jun 13, 2026

Advertisement

పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పని చేస్తున్న 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే  ఆత్మహత్య కు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు  నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.  అమిత్ అభయ్ బ్రహ్మే  ఈ నెల2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడి    ఆత్మహత్య  కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న మానసిక వేధింపుల చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. జూన్ 9న అమిత్ 19 ఏళ్ల కుమారుడు అనీష్ బ్రహ్మే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతోనే ఈ  ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో అమిత్ రాసిన సూసైడ్ నోట్  లభించింది. తన చావుకు గల కారణాలను, తను అనుభవించిన నరకాన్ని అమిత్ అభయ్ బ్రహ్మే ఆ లేఖలో కళ్లకు కట్టాడు. 

ఆ సూసైడ్ నోట్‌లో అమిత్ బ్రహ్మే తన సహోద్యోగినులు అర్చన, శశ్వతిలపై   తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆఫీసులో అందరి ముందూ తనను పదేపదే అవమానించే వారనీ, మానసికంగా కుంగిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అసలు నైపుణ్యం,  అనుభవం లేని ప్రాజెక్టులను కావాలనే అప్పగించి, ఆపై పనితీరు సరిగా లేదంటూ బహిరంగంగా మందలించేవారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ  తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొన్నాడు. దీనికి తోడు, అమిత్ స్నేహితుడు వినోద్ పలిచా సైతం నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. కంపెనీ యాజమాన్యానికి అమిత్‌పై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఈమెయిల్స్ పంపి, ఆయన కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని ఆ లేఖ ద్వారా తెలిసింది.

బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు,  లభించిన ఆధారాల మేరకు  పోలీసులు  అర్చన, శశ్వతి మరియు వినోద్ పలిచాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదనీ.. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈఘటనపై టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. తమ సంస్థలో ఉద్యోగుల మానసిక శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించింది. అంతర్గతంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేలుస్తామని హామీ ఇచ్చింది.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.