Publish Date:Jan 23, 2025
దావోస్ లో తెలంగాణ పెట్టుబడుల వేట విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఇంధన రంగ దిగ్గజ సంస్థ సన్ పెట్రో కెమికెల్స్ రాష్ట్రంలో 45 వేల 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చంది. ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ప్రతినిథులతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను సన్ పెట్రో కెమికల్స్ సంస్థ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల సామర్ధ్యం 3 వేల 400 మెగావాట్లు కాగా వీటికి 5440 మెగావాట్ల సామర్ధ్యం ఉండే సోలార్ పవర్ ప్రాజెక్టులను అనుసంధానంొ చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ తెలిపింది.
ఈ ఒప్పందం కుదిరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిథులను అభినందించారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్య సాధనలో ఈ ఒప్పందాన్ని ఒక మైలు రాయిగా అభివర్ణించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాిలు ఏర్పడతాయన్నారు. అలాగే సన్ పెట్రో ప్రాజెక్టుల కారణంగా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా పురోగమిస్తాయన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటి సారి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sun-petro-chemicals-to-invest-in-telangana-39-191716.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.