Publish Date:Nov 14, 2024
గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు జ్ణానోదయం అయ్యింది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అందరికీ క్షమాపణలు చెప్పేశారు. జగన్ తో మొదలు పెట్టి ఆయన సతీమణి భారతి నుంచి మంత్రులు లోకేష్, అనితలకు కూడా క్షమాపణలు చెప్పారు. షర్మిలనూ, వైఎస్ సునీతనూ కూడా క్షమించమని వేడుకున్నారు.
ఇకపై ఎలాంటి అసభ్య పోస్టులూ పెట్టనని దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. అయితే అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక అన్నట్లుగా గత కొన్నేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఆమె చేసిన దూషణలు కేవలం క్షమాపణ సరిపెట్టేయడం అసాధ్యం. కేవలంమహిళ అన్న కారణంగా ఎవర్నయినా ఎంత మాటయినా అనేయచ్చు అన్నట్లుగా వ్యవహరిం చిన శ్రీరెడ్డి గత కొన్నేళ్లుగా చేసింది తన బూతు పురాణంతో జగన్ వ్యతిరేకులను దూషించడమే. శ్రీరెడ్డి సామాజిక మాధ్యమం వేదికగా ఎంత వల్గర్ గా మాట్లాడారో తెలియంది కాదు. గత ఐదేళ్ళుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , హోంమంత్రిపై దూషణల పర్వం కొనసాగించారు. ఇన్నాళ్ళకు పాపం పండింది. అరెస్టు తప్పదని అర్థం కావడంతో శ్రీరెడ్డి ఆడపిల్లని కనికరించండంటూ క్షమాపణలు చెబుతున్నారు.
అయితే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఆ క్షమాపణలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆ లేఖ ఆధారంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఆమెపై మరో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఎవరెవరికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టారో ఆ పేర్లన్నీ ఆమె రాసిన లేఖలోనే ఉన్నాయి. దానినే పేర్కొంటూ తాజాగా మరో ఫిర్యాదు దాఖలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srireddy-letter-say-goodbte-to-ycp-25-188354.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.