బాబోయ్ నాకు టిక్కెట్ వద్దు...నన్ను వదిలేయండి ...నరసన్న పేటలో పోటీకి అచ్చెన్నాయుడు ససేమిరా
Publish Date:Mar 26, 2012
Advertisement
ఎక్కడైనా ఎన్నికలొచ్చాయంటే ప్రధాన పార్టీల టిక్కెట్ల కోసం అభ్యర్థులు ఎగబడుతుంటారు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో తెలుగుదేశం తరపున పోటీ చెయ్యాల్సిందిగా స్వయానా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన అచ్చెన్నాయుడు మరోసారి కూడా వోటమి పాలైతే తన రాజకీయ జీవితం సమాధి అయిపోతుందనే భయంతోనే పోటీకి ససేమిరా అంటున్నారు. కేంద్రమాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి సోదరుడైన అచ్చెన్నాయుడు వ్యక్తిగత కారణాల వల్ల తాను పోటీ చేయలేనని పైకి అంటున్నారు. అయితే పార్టీ తనను కాకుండా ఎవరిని నిలిపినా అతని విజయానికి కృషి చేస్తానంటున్నారు. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీలోని అచ్చేన్నాయుడి వ్యతిరేక వర్గీయులు కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే విజయానికి కృషి చేస్తామని వారు చెబుతున్నారు. కాని నిజంగా అచ్చెన్నాయుడు పోటీ చేస్తే అతనిని వోడించి జిల్లాలో కింజరాపు సోదరుల ప్రతిష్టను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యతిరేక వర్గీయులకు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆశీస్షులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుట్రను పసిగట్టిన కింజరాపు అచ్చెన్నాయుడు ఎట్టిపరిస్థితుల్లోనూ తాను పోటీ చేయనని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/srikakulam--dist-narasannapet-assembly-constituency-24-12908.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





