సింగరేణి కార్మిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ?
Publish Date:Jun 18, 2012
Advertisement
ఈ నెల 28న జరగనున్న సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. ఎ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్.టి.యు.సి. టి.బి.జి.కెన్. యూనియన్లు పోటీపడుతున్నాయి. ఈ సంస్థ 11 ఏరియాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికి మూడుసార్లు ఎ.ఐ.టి.యు.సి., ఒకసారి ఐ.ఎన్.టి.యు.సి. ఈ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపొందాయి. ఇప్పటికే 11 ఏరియాల్లో 3 ఏరియాల్లో టి.బి.జి.కెన్. విజయం సాధించింది. కొన్ని ప్రాంతాల్లో ఈసారి చతుర్ముఖపోటీ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. సి.ఐ.టి.యు. ఈ చతుర్ముఖపోటీలో పై మూడు యూనియన్లతో పోటీపడుతుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ సింగరేణి పరిశ్రమలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఇటీవల ముగిసిన ఉపఎన్నికల కన్నా సీరియస్ గా జరుగుతున్నాయి. యూనియన్లు అన్నీ తాము గుర్తింపు యూనియన్ గా ఎన్నికైతే కర్ముకులకు ఏమి చేయాలనుకుంటున్నాయో అజెండారూపంలో తెలిపే కరపత్రాలను కూడా పంపిణీ చేశాయి. ఇటీవల కార్మికులను నేరుగా కలిసిన యూనియన్ల నాయకులు ఇప్పటిదాకా తమ సంఘం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాయో విశాదీకరించాయి. దీంతో ఏ సంఘానికి ఓటు వేయాలనే అంశంపై కార్మికులు చర్చిస్తున్నారు. అంతేకాకుండా యూనియన్ అజెండాల్లో ఉన్న కీక అంశాలు కూడా ఈ చర్చల్లో నలుగుతున్నాయి. అయితే కొత్తగా తెలంగాణావాదాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టేందుకు టి.బి.జి.కెన్. ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతీయతా బేధాలు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంచిది కాదని ఏ.ఐ.టి.యు.సి, ఐ.ఎన్.టి.యు.సి. తదితర యూనియన్లు కార్మికులకు వివరించాయి.
http://www.teluguone.com/news/content/singareni-workers-union-24-14956.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





