జగన్ పై షర్మిల ప్రశ్నాస్త్రాలు? మద్యం కుంభకోణంలో విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీత

Publish Date:May 24, 2025

Advertisement

మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపిస్తున్నది. అధికారంలో ఉండగా చేసిన పాపాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సొంత తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టేసిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అండగా నిలిచారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

అధికార పగ్గాలు చేపట్టిన తరువాత షర్మిలను జగన్ దూరం పెట్టారు. ఆ తరువాత షర్మిల రాష్ట్రం  వదిలి వెళ్లి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుంచీ సందర్భం వచ్చినప్పుడల్లా సోదరుడిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇదంతా తెలిసిందే. కారణమేంటో తెలియదు కానీ ఇటీవల కొంత కాలంగా షర్మల జగన్ లక్ష్యంగా విమర్శలు చేయడం తగ్గించారు. కానీ తాజాగా మరోసారి షర్మిల జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గురువారం ( మే 22) మీడియా సమావేశంలో మాట్లాడిన తరువాత  షర్మిల జగన్ కు కీలక ప్రస్నాస్త్రాలు సంధించారు.  ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉన్న ష‌ర్మిల‌ తాజా ప్రశ్నలతో మరో సారి జగన్ ను ఇరుకున పెట్టారని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణంలో వరుసగా బయటపడుతున్న అంశాలు  థ్రిల్లర్ సిరీస్ ను త‌ల‌పిన్నాయన్న షర్మిల.. ఆ కుంభకోణం దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలతో వైసీపీలో భయం మొదలైందన్నారు.  

మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా ఉన్నాయన్నారు. బట్టలూడదీస్తాను, తరిమితరిమి కొడతాను అంటూ జగన్ వ్యాఖ్యానించడాన్ని షర్మిల తప్పుపట్టారు. సీఎంగా ఉండగా జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్న ష‌ర్మిల‌..  ఆ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింది నువ్వే కదా అని జగన్ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె  రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్, ముంబై న‌టి కాదంబరి జెత్వానీ ఉదంతాలను గుర్తు చేశారు.  

లిక్కర్ కుంభకోణంలో జగన్ మీద ఆరోపణలు ఉన్నాయన్న షర్మిల వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యం లేక పిరికిపందలా దాక్కుంటున్నారని విమర్శించారు. వైఎస్ కుమారుడిగా ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిన జగన్ ఇలా పిరికిపందలా భయంతో వణికిపోవడమేంటని ప్రశ్నించారు. అంతే కాదు అసలు జగన్ అసెంబ్లీకి ఎందకు వెళ్లడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  లిక్కర్ కుంభకోణంపై తనను విచారించాలని జగన్ అడగడం లేదంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా అని షర్మిల ప్రశ్నించారు.  వైసీపీ హయంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ ను ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించిన ఆమె ఆ లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడకు పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.  

By
en-us Political News

  
బాపట్లా జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.
తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి .
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
తొలి నుంచి క‌మల్ హాస‌న్ ది ద్ర‌విడ నాస్తిక వాదం. అది బై బ్ల‌డ్ అలా వ‌చ్చిందా అన్నది తెలీదు కానీ ఆయ‌న ద‌క్షిణాదిలోనే ఏఎన్నార్ త‌ర్వాత నాస్తిక‌వాదంలో అగ్ర‌గ‌ణ్యుడు.
పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది.
ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.