జగన్ నుంచి వైఎస్ బ్రాండ్ ను లాగేసుకున్న షర్మిల

Publish Date:Apr 6, 2024

Advertisement

కడప ఎంపీ ఎన్నిక అజెండాగా వివేకా హత్య కేసు

వైఎస్ బిడ్డ వైపా.. వివేకా హంతకుడివైపా అంటూ షర్మిల ప్రచారం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జనం వైఎస్ కుమారుడు అన్న సానుభూతితో ఒక సారి అధికారాన్ని అప్పగించారు. వైఎస్ కుమారుడు అన్న ఒక్క కారణమే కాకుండా మొత్తం వైఎస్ కుటుంబం అంతా జగన్ వెనుక నిలబడటం కూడా జగన్ ను జనం నమ్మడానికి ఒక కారణంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా మొత్తం కుటుంబం జగన్ వెంట నిలబడటంతో వైఎస్ బ్రాండ్ గంపగుత్తగా జగన్ కు సొంతమైపోయింది. దీంతో  వైఎస్ జీవితమంతా పని చేసిన కాంగ్రెస్ కు గత రెండు ఎన్నికలలోనూ కూడా భారీ నష్టం వాటిల్లింది. మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా జగన్ వెంట నిలిచింది. దీంతో 2019 ఎన్నికలలో జగన్ కు విజయం సునాయాసమైంది.

అన్నిటికంటే జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రజలలో సెంటిమెంట్ రగల్చడంలో సక్సెస్ అయ్యారు. ఆ తరువాత వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం ఎన్నడూ బహిరంగంగా కనిపించని ఆయన సతీమణి విజయమ్మ కుమారుడి కోసం బయటకు వచ్చి ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చింది. ఇక సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య, విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిందని చెబుతున్న కోడికత్తి దాడి సంఘటనలు కూడా జగన్ పై ప్రజల సానుభూతి వెల్లువెత్తడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు అంటే 2024 ఎన్నికల ముంగిట నాడు జగన్ విజయానికి దోహదం చేసిన ప్రతి అంశమూ ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా జగన్ సొంత చెల్లి షర్మిల అన్నకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, వివేకా హత్య విషయంలో ఆమె నేరుగా జగన్ పై సంధిస్తున్న ఆరోపణాస్త్రాలూ ప్రజలలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.  

కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షర్మిల  ప్రచారం ప్రారంభించారు. తొలి రోజునే ఆమె సూటిగా సుత్తి లేకుండా నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ బిడ్డగా తాను జనం ముందుకు నిలబడ్డాననీ, జగనన్న మాత్రం వివేకా హంతకుల వైపు ఉన్నారనీ వ్యాఖ్యానించారు.    అంతే కాకుండా కడప బరిలో వైఎస్ విడ్డ వివేకా హంతకుడితో తలపడుతోందని చెప్పారు. ఈ మాటలతో షర్మిల వైఎస్ బ్రాండ్ ను జగన్ కు దూరం చేసి తన సొంతం చేసుకున్నారు. షర్మిల ప్రచారం తొలి రోజునే ఆమె ప్రసంగం, ఆమె వ్యాఖ్యలు ఒక్క కడప నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  స్వయంగా షర్మిలే అవినాష్ ను వివేకా హంతకుడిగా అభివర్ణించడం, ఆమె మాటలు అక్షర సత్యాలని వివేకా కుమార్తె సునీత చెప్పడంతో కడపలో అవినాష్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిలకు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను దూరంపెట్టారన్న సానుభూతీ ఉంది.  వివేకా హంతకుడికా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డకా ఓటు అన్న ఒక్క ప్రశ్నతో  కడప ఎంపీ ఎన్నికల ఎజెండాగా వివేకా హత్య కేసును మార్చడంలో షర్మిల సక్సెస్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.