కమలం గూటికి శశి థరూర్?

Publish Date:May 3, 2025

Advertisement

ప్రధాని వ్యాఖ్యలతో  రాజకీయ దుమారం 

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్  సొంత పార్టీలో అంత సుఖంగా  లేరన్న ప్రచారం చాలా చాలా కాలంగా  జరుగుతోంది. ఒక దశలో ఆయన కాంగ్రెస్ పార్టీకి  గుడ్ బై  చెప్పడం ఖాయమని జాతీయ మీడియాలో  కథలు, కథనాలు చాలానే వచ్చాయి.  కథలు, కథనాలు రావడం ఒకెత్తు అయితే..  స్వయంగా ఆయనే  కాంగ్రెస్ పార్టీ తనను పక్కన పెట్టిందని  ఆరోపించారు. ఇంకో అడుగు ముందుకేసి,  నేను కాంగ్రెస్  కు అవసరం అనుకుంటే కాంగ్రెస్ లో ఉంటాను  అవసరం లేదనుకుంటే నా ముందు చాలా ప్రత్యన్మాయాలున్నాయి  అంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడారా..  లేక రచనా వ్యాసంగం, ఉపన్యాసాల వంటి ఇతర అంశాల గురించి మాట్లాడారా? లేక రెండింటి గురించి మాట్లాడారా  అనే విషయంలో ఆయన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. 

 అదెలా ఉన్నా.. గత కొంత కాలంగా శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా ఆయన బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు మరింత క్లియర్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో సెల్ఫి తీసుకోవడం, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో  మోదీ అనుసరించిన విధానాన్ని తాను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణలు చెప్పడం వంటి అనేక పరిణామాలు, సంఘటనలు శశి థరూర్  బీజేపీకి దగ్గరౌతున్నారనే వాదానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఇదలా ఉంటే..  ప్రధాని మోదీ తాజా కేరళ పర్యటన  శశి థరూర్  ను బీజేపీకి మరింత దగ్గర చేసిందని అంటున్నారు. అన్తునంరు. ముఖ్యంగా తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక విఝింజమ్‌ అంతర్జాతీయ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా  ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా  చర్చనీయాంశ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేరళ ముఖ్య మంత్రి పినరన్ విజయన్,  తిరువనంతపురం  ఎంపీ శశి థరూర్  పాల్గొన్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో శశి థరూర్ ఉన్నారు,  ఇది కొందరి నిద్రను భంగం చేస్తుందని  అన్నారు. నిజానికి, ప్రధాని మోదీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ.. చాలా కాలంగా శశి థరూర్ బీజేపీలో చేరుతున్నారనే వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపాయి. అంతే కాకుండా.. శశి థరూర్‌ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలకడంతో పాటు  ఢిల్లీ  ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి చేరుకుని తన నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికానని సంతోషం వ్యక్తపరిచారు.  దీంతో శశి థరూర్‌ బీజేపీలో చేరారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి సొంత నియోజక వర్గానికి వచ్చిన ప్రధానికి స్థానిక ఎంపీ స్వాగతం పలకడం పెద్ద విషయం కాదు, అలాగే.. ప్రధాని మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే.. గత కొంతకాలంగా శశిథరూర్‌ కాంగ్రెస్ అధినాయకత్వంతో సఖ్యతగా లేరని, పార్టీలో ఆయన పాత్రపై అసంతృప్తితో ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ విషయం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

అయితే..  కేరళ ముఖ్య మంత్రి పదవిని ఆశిస్తున్న శశిథరూర్‌ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. వచ్చే సంవత్సరం జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారనీ, అందుకు  అధిష్టానం నో  అందనీ ప్రచారం జరుగుతోంది.  అందుకే  శశిథరూర్‌ ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుకొచ్చే వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ కేరళ పర్యటన.. ఆ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన  వ్యాఖ్యలు మరోసారి శశిథరూర్‌  కాంగ్రెస్ సంబంధాల పై చర్చను తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 

మర్కట సందేశం 

అదలా ఉంటే.. ఇటీవల  శశిథరూర్‌  తన ఢిల్లీ నివాసంలో బయట గార్డెన్ లో కూర్చుని పేపర్ చదువు కుంటున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ  ఒక కోతి వచ్చి ఆయన ఒడిలో కూర్చుంది. సిబ్బంది ఇచ్చిన అరిటిపండ్లు తిన్నది. ఆ తర్వాత శశి థరూర్‌ ఒడిలో ఆ కోతి సేదతీరింది. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో ఆయనే స్వయంగా పోస్ట్‌ చేశారు. ఈ అసాధారణ అనుభూతిని ఎక్స్‌లో పంచుకున్నారు. ఈరోజు ఒక అసాధారణ అనుభవం కలిగింది. ఉదయం నేను గార్డెన్‌లో కూర్చొని వార్తాపత్రికలు చదువుతున్నా. ఒక కోతి నేరుగా నా వద్దకు వచ్చింది. నా ఒడిలో కూర్చొంది. రెండు అరటి పండ్లు ఇవ్వగా చాలా ఆకలితో తిన్నది. నన్ను కౌగిలించుకుని నా ఛాతిపై తల ఆనించి నిద్రపోయింది. నేను మెల్లగా పైకి లేవగా కిందకు దూకి అక్కడి నుంచి వెళ్లిపోయింది అని పేర్కొన్నారు. మరోవైపు శశి థరూర్‌ ఒడిలో కోతి కూర్చోవడం, అరటి పండ్లు తినడం, ఆ తర్వాత ఆయనను హత్తుకుని నిద్రించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కొందరు శశి థరూర్‌ పార్టీ మారాలని ఆ కోతి మర్కట సందేశం ఇచ్చిందని అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.