హాస్య నటుడు అలీకీ ట్రాజడీయేనా.. జగన్ చెప్పిన తీపి కబురు రాజ్యసభ సీటు కాదా?

Publish Date:May 4, 2022

Advertisement

హాస్య నటుడు అలీకి జగన్ హామీ ఇచ్చిన తీపి కబురు అందడం లేదా? ఆశించినట్లుగా రాజ్యసభకు అలీకి అవకాశం ఇవ్వడం లేదా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అలీకి జగన్ హ్యాండిచ్చారనే అర్ధమౌతుంది.  ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. సంఖ్యా బలాన్ని బట్టి ఆ నాలుగూ కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి. జగన్ అలీని రాజ్యసభకు పంపుతారని హామీ ఇచ్చారనీ, అందుకే సినీ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కూడా కాదని అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనీ ఒక ప్రచారం ఉంది. అంతే కాకుండా జగన్ ఇటీవల స్వయంగా అలీని తిరుపతికి పిలిపించుకుని మరీ  త్వరలో శుభ వార్త వింటారని చెప్పారనీ కూడా అంటున్నారు. ఆ శుభ వార్త రాజ్యసభ టిక్కెట్టేనని అలీతో సహా అంతా భావించారు. మరి అంతలోనే ఏమైందో రాజ్యసభ టికెట్ల అభ్యర్థుల ఎంపికలో అలీ పేరు కనీసం పరిశీలనకు కూడా రాలేదంటున్నారు. ఇక ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి రెన్యువల్ చేసే పరిస్థితే లేదని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దీంతో రాజ్యసభకు జగన్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జగన్ కేసులు వాదించే న్యాయవాది నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు పంపించే యోచనలో జగన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంటే మరో రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ రెండు స్థానాలలో ఒకటి ఎస్సీలకు కేటాయించాలని జగన్ భావిస్తున్నారు. ఆ కోటాలో డొక్కా మాణిక్యవరప్రసాద్, బీరం మస్తానరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. మరో స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించి, విస్తరణలో ఆ వర్గానికి మొండి చేయి చూపి ఎదుర్కొన్న విమర్శల నుంచి బయటపడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జగన్ నటుడు అలీ రాజ్యసభ ఆశలు గల్లంతైనట్లేనని అంటున్నారు. జగన్ ను నమ్ముకుని పార్టీలో చేరిన అలీకి ఇది రెండో ఆశాభంగంగా చెప్పుకోవచ్చు. మొదటిది 2019 ఎన్నికలలో అలీకి రాజమండ్రి, మంగళగిరిలలో ఏదో స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఆ ఆహామీ కారణంగానే అప్పట్లో జనసేనలో చేరుదామని భావించిన అలీ మనసు మార్చుకుని వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారంటారు. అలీ, పవన్ కల్యాణ్ మంచి స్నేహితులన్న విషయం సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. అలాంటిది అలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇరువురి మధ్యా స్నేహం కూడా చెడింది. పవన్ కల్యాణ్ అలీ వైసీపీలో చేరడాన్ని ప్రస్తావిస్తూ, సాయం పొందిన వ్యక్తులు కూడా ఇలా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిగా అలీ కూడా ఏం సాయం చేశారు పవన్ కల్యాణ్ గారూ, ఎవరికైనా చెప్పి సినిమా అవకాశాలు ఇప్పించారా? డబ్బు సాయం ఏమైనా చేశారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం కూడా తెలిసిందే. 
 
అప్పట్లో అసెంబ్లీ సీటు విషయంలో మాటతప్పిన జగన్ ఇప్పుడు రాజ్యసభ టికెట్ విషయంలో మడమ తిప్పడంతో జగన్ ను నమ్ముకున్న అలీకి రెండు సార్లూ నిరాశ ఎదురైనట్లయ్యింది. రాజ్యసభ రేసులో ఎంటరౌతూనే ఔటైపోయిన అలీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

By
en-us Political News

  
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.