జాతీయ ఐక్యతా దినోత్సవం*  ఉక్కుమనిషి ఉక్కు సంకల్పమే నేటి ఐక్య భారతం..

Publish Date:Oct 31, 2023

Advertisement


ప్రపంచదేశాలలో ఎంతో గొప్పదైన భారతదేశం ఒకప్పుడు బ్రిటీషర్ల చేతుల్లో నలిగింది. భారత ప్రజలు తెల్లదొరల కింద బానిసలుగా జీవితాన్ని గడిపారు.  ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తిని కలిగించడానికి,దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది వీరులు దేశం కోసం పాటుపడ్డారు. వీరిలో భారతీయులు ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు.  565 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన రాచరిక రాష్ట్రాలు, బ్రిటీష్ కాలం నాటి వలసరాజ్యాల ప్రావిన్సుల నుండి  భారతదేశాన్ని ఐక్యంగా  రూపొందించడంలో ఈయన కృషి చేశారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా, భారతదేశ మొదటి హోం మినిన్టర్ గా పనిచేసిన  సర్దార్ వల్లబాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి యేటా  అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశం ఏకం కవడానికి ఆయన చేసిన ఉక్కు సంకల్పం కారణంగానే ఆయనకు ఉక్కుమనిషి అనే బిరుదు వచ్చిందని కూడా అంటారు. అసలు ఈ జాతీయ ఐక్యతా దినోత్సవం చరిత్ర ఏమిటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం దేశానికి ఎలా ఉపయోగపడింది? ఈయన జీవితం ఏంటి?  మొదలైన విషయాలు పూర్తీగా తెలుసుకుంటే..

భారతదేశపు ఉక్కు మనిషి వల్లభాయ్ ఝవేర్‌భాయ్ పటేల్ అక్టోబర్ 31, 1875న జన్మించాడు. ఈయనను సర్దార్ పటేల్ అని కూడా పిలుస్తారు.  స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ వారు  వైదొలిగినప్పుడు  భారతదేశాన్ని ఒక తాటిమీద నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన నాయకులలో ఈయన అగ్రగణ్యుడు. దేశాన్ని విభజించి పాలించడమనే వ్యూహంలో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, సర్దార్ పటేల్ భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.

సర్దార్ పటేల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధి చెందారు.  భారతదేశం , పాకిస్తాన్ విభజన తర్వాత స్వతంత్ర ప్రావిన్సులను ఏకీకృత భారతదేశంలోకి చేర్చడంలో  ఆయన  గణనీయమైన పాత్ర పోషించాడు.  భారతదేశ రాజకీయ ఏకీకరణ,1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో హోం మంత్రిగా కూడా పనిచేశాడు.

జాతీయ ఐక్యతా దినోత్సవం..


2014లో రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ ఐక్యతా దినోత్సవం  అధికారిక ప్రకటనను దేశ హోం మంత్రిత్వ శాఖ అనౌన్స్  చేసింది. జాతీయ ఐక్యత దినోత్సవం "మన దేశ ఐక్యత, సమగ్రత ,భద్రతకు అసలైన  అర్థం  దేశానికి ఏర్పడే  బెదిరింపులను తట్టుకోవడానికి దేశానికి ఉన్న సహజమైన బలాన్ని, స్థితిస్థాపకతను  తిరిగి సంపాదించుకోవడానికి, దాన్ని ధృవీకరించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా దేశ బలం అందరికీ చాటి చెప్పినట్టు అవుతుంది. ఈ విషయాన్ని చాటి చెప్పడమే జాతీయ ఐక్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.


 భారతదేశం కోసం ఆయన చేసిన కృషికి గుర్తుగా  సర్దార్ పటేల్ జయంతిని  జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజును జరుపుకోవడానికి ముందు  'యూనిఫైయర్ ఆఫ్ ఇండియా' స్టాట్యూ ఆఫ్ యూనిటీతో సర్దార్ వల్లబాయ్ పటేల్ ను దేశం మొత్తం  సత్కరించుకుంది.   వాస్తవానికి ఇది  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.  సుమారు 597 అడుగుల ఎత్తులో సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఆయన్ను దేశం గౌరవించుకుంది.  అక్టోబర్ 31, 2018న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అక్టోబర్ 31, 2019న, భారత చరిత్రలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడానికి 'రన్ ఫర్ యూనిటీ' అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం  జరిగింది. ఆయన 144వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం లో   ప్రారంభమైన రన్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ఇండియా గేట్ సి-హెక్సాగన్-షాజహాన్ రోడ్ వద్ద దాదాపు ఒక మైలు దూరం పరుగు సాగింది.  హిందువులూ, ముస్లింలు ఒకే దేశంలో నివసించాలని సంకల్పించి ఆ దిశగా పోరాటం చేసి దాన్ని సాధించిన ఉక్కు మనిషిగా సర్థార్ వల్లబాయ్ పటేల్ యావత్ దేశ ప్రజలకు పూజ్యునీయుడు.

పాఠశాలల్లో, కళాశాలల్లో సర్దార్ పటేల్ గురించి పిల్లలకు వివరించి చెప్పడం. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం గురించి పిల్లలకు చెప్పి వారిలో  చైతన్యం కలిగించడం సర్దార్ పటేల్ వ్యక్తిత్వం ద్వారా పిల్లలు మంచి విషయాలు నేర్చుకునేలా పిల్లలను గైడ్ చేయడం ద్వారా పిల్లలలో మంచి క్రమశిక్షణ, గొప్పవిలువలు అలవడతాయి.

                                               *నిశ్శబ్ద.

By
en-us Political News

  
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు....
ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.