నేను సుద్ద పూసను.. వాలంటీర్లే విలన్లు.. పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి

Publish Date:May 29, 2025

Advertisement

అధికారం అండ చూసుకుని సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిగా చెలరేగిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి సన్ ఆఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసుల విచారణలో మాత్రం  . తాను సుద్దపూసననీ, తనకే పాపం తెలియదనీ చెప్పుకొచ్చారు. అసలైన విలన్స్ వేరు ఉన్నారంటూ తాను తప్పించుకోవడానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేయడానికి శతధా ప్రయత్నించారు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న సామెతలా సజ్జల భార్గవ్ రెడ్డి తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు. 

సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయారు. ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడీ కేసు నుంచి బయటపడటానికి నెపం వాలంటీర్ల మీద నెట్టేస్తున్నారు. తాను సుద్దపూసననీ వాలంటీర్లే అసలు విలన్లను చెబుతున్నారు. మంగళగిరి పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డిని నిన్న రెండున్నర గంటల పాటు  విచారించారు.  ఆ సందర్భంగా పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకూ తనకూ అసలు సంబంధమేలేదనీ, అంతా వాలంటీర్లే చేశారని చెప్పారు. అయితే ఆ పోస్టులు మీ పేరు మీద ఎలా షేర్ అయ్యాయన్న పోలీసుల ప్రశ్నలకు సజ్జల వద్ద సమాధానమే లేదు.  

విచారణ సందర్భంగా సజ్జలను ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఉపయోగించిన లాప్ టాప్, మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగితే నిరాకరించారు. విచారణ సందర్భంగా సజ్జలను పోలీసులు 22 ప్రశ్నలు అడిగారు. వాటిలో వేటికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు తన పని కాదనీ, అదంతా వాలంటీర్లు చేశారనీ పదేపదే చెప్పినట్లు తెలిసింది.  మరి వాలంటీర్లను ఎందుకు నియంత్రించలేదంటే మాత్రం సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి పన్నెండుర గంటల వరకూ దాదాపు రెండున్నర గంటల విచారణ అనంతరం సజ్జలను మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపేశారు.  

విచారణ అనంతరం విచారణాధికారి అవసరమేతే మళ్లీ సజ్జలకు సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.  పర్వత  చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డిలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న రాజేష్ బాబు అనే వ్యక్తి ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల తెలిపిన సీఐ ఆయనకు మరో సారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి  విచారణకు సహకరించకుంటే  అరెస్టయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.