ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. తీగ లాగేశారు.. ఇక డొంక కదలాల్సిందే!

Publish Date:Nov 26, 2024

Advertisement

వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ  రెబెల్ ఎంపీ   రఘురామ క్రిష్ణంరాజును ఆయన జన్మదినం రోజునే అదుపులోకి తీసుకుని కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కలకలం రేపింది.  తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఎవరినీ వదలేది లేదని రఘురామకృష్ణం రాజు అనాడే ప్రతిజ్ణ చేశారు.  

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడు నాడు కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిపై కేసుల దర్యాప్తు జోరందుకుంది.  రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన  కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ  విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు పోలీసు కస్టడీలో ఉన్న తనపై  విజయపాల్ హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు  ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలుకు పిలిపించి ప్రశ్నించారు. తొలి సారి విచారణలో విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదు. ఆ తరువాత హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ కూడా ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం మంగళవారం విజయ్ పాల్ ను ఒంగోలు పోలీసులు మరో సారి సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేశారు.  ఆయన రిమాండ్ రిపోర్టును కూడా రెడీ చేశారు. ఆయనను ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ది తొలి అరెస్టు. ఈ కేసులో విజయ్ పాల్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది.  ఇంకా ఈ కేసులో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహా మరి కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా పోలీసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు.   ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు గత ప్రభుత్వంలో  తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తనను భౌతికంగా అంతం చేయాలన్న కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చి వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.  ఇక విజయ్ పాల్ అరెస్టుతో డొంక కదిలే అవకాశం ఉంది. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా ముందు ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.