Publish Date:May 22, 2022
తెలుగు వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు రామ్ గోపాల్ వర్మ.. సినిమా దర్శకుడిగా ఆయన ఎంత ప్రముఖుడో అంతటి వివాదాస్పద వ్యక్తి. కెరీర్ తొలి నాళ్లలో అందరి అభిమానాన్ని చూరగొనే విధంగా కొన్ని సినిమాలు తీసిన రామగోపాల వర్మ ఆ తరువాత రాజకీయ సినిమాలతో తెలుగునాట రచ్చ చేసిన వ్యక్తి.
ఇక అక్కడ నుంచి మరీ బరితెగించేసి నా సినిమా నా ఇష్టం అంటూ సభ్య సమాజం అంగీకరించలేని కథలతో సినిమాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. సామాజిక మాధ్యమంలో అత్యంత చురుకుగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. ఎవరేం అనుకుంటే నాకేంటి నా బతుకు నా ఇష్టం అంటూ ఇష్టారీతిన పోస్టులు పెడుతుంటాడు. తరచూ మీడియాలో కూడా కనిపిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు.
ఆయన వివాదాలను ఆహ్వానిస్తాడు. తన సినిమాలు ఫ్లాప్ అయినా.. వివాదాలే తనకు విందు భోజనం అన్న రీతిలో బే ఫికర్ గా గడిపేస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఉప రాష్ట్ర పతి వ్యాఖ్యలకు షేక్ అయిపోయాడు. నేరుగా తనను పేరు పెట్టి చేసిన వ్యాఖ్యలు కాకపోయినా భుజాలు తడిమేసుకున్నాడు. వ్యంగ్య ట్వీట్లతో మరోసారి రచ్చకెక్కాడు. ఇంతకీ జరిగిందేమిటంటే... పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఆ కార్యక్రమంలో ఆయన సిరివెన్నలా బాషా వైదుష్యాన్ని పొగుడుతూ, ఇటీవల కోందరి సినిమాలు అజ్ణానానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటున్నాయనీ, అశ్లీలతా, అసభ్యతల హద్దులు చెరిపేస్తున్నాయనీ వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు జనరల్ గా చేసిన ఆ వ్యాఖ్యలు సూటిగా రామగోపాల వర్మకే తగిలినట్లున్నాయి. అందుకే ఓహోఅలాగా, నిజామా? ఫెంటాస్టిక్.. మంచి సూచనలు ఇచ్చినందుకు ధ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. అయినా ఇలాంటి మండి పాట్లను లెక్క చేసే తత్వం కాదనుకోండి ఆయనది. కానీ తాను తీస్తున్న సినిమాలు సభ్య సమాజం మెచ్చేవి కావని రామ్ గోపాల్ వర్మకు స్పష్టంగా తెలిసు కనుకనే వెంకయ్యనాయుడు జనరల్ గా చేసిన వ్యాఖ్యలకు గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా స్పందించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rjg-accepts-venkayya-comments-on-stupid-moovies-25-136266.html
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.