కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్?

Publish Date:Oct 19, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో అద్భుతమేమీ జరగలేదు. అనూహ్యమైన ఫలితం ఆవిష్కృతం అవ్వలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మరో  416 ఓట్లు చెల్లలేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.

దీంతో రిగ్గింగ్ సంస్కృతి ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా పాకిందా? ఇప్పటిదాకా అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ జాడ్యం పార్టీ సంస్థాగత ఎన్నికలకు కూడా పాకిందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఈ పదవికి పోటీ పడిన శశిథరూర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా.. శశిథరూర్ కు వెయ్యి 72 మంది ఓటు వేశారు. కాగా.. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తాజాగా నిర్వహించిన ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి.

ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చవిచూసిన శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కొత్త అధ్యక్షుడు ఖర్గేను అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తరప్రదేశ్ లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి శశిథరూర్ బృందం రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది.

ఒక పక్కన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన సల్మాన్ సోజ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయం మిస్త్రీ కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోవడంతో ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమగ్రత లోపించడం శోచనీయం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. యూపీలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా.. న్యాయంగా , పారదర్శకంగా జరిగినట్లు ఎలా అవుతుంది? అందువల్ల యూపీలోని ఓట్లన్నీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని థరూర్ బృందం ఆ లేఖలో పేర్కొన్నదని చెబుతున్నారు.

అయితే.. అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు లీకవడంతో సల్మాన్ సోజ్, శశిథరూర్ స్పందించారు. సీఈఏకి అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు లీక్ అవడం దురదృష్టకరం.  కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే ఈ ఎన్నిక. విభజించేందుకు కాదు. ఈ విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణతో అనవసర వివాదానికి ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.