దూకుడు పెంచిన రేవంత్‌.. 26 నుంచి స‌రికొత్త పాల‌న!

Publish Date:Jan 5, 2025

Advertisement

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఈనెల 26వ తేదీ నుంచి స‌రికొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చిన రేవంత్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల‌పై ఎదురు దాడినీ కొన‌సాగించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తూ   సాగుతున్నారు. అయితే  ఈ ఏడాది కాలంలో రేవంత్ స‌ర్కార్ పాల‌న‌కు అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ కొంత‌ మేర విఫ‌ల‌మైంద‌న్న వాద‌న తెలంగాణ సమాజంలో బలంగా  వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రైతుల‌కు మేలుచేసే విష‌యంలో ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో విజ‌యవంతం కాలేద‌న్న అభిప్రాయం ఉంది. రెండు ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేసిన‌ప్ప‌టి.. రైతులందరికీ రుణ‌మాపీ అంద‌లేదు. దీంతో రుణ‌మాఫీ కాని రైతులు రేవంత్ స‌ర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని చెబుతోంది.  అయితే, ఏడాది కాలంలో వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుకుంటూ స‌రికొత్త పాల‌నకు శ్రీ‌కారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జ‌న‌వ‌రి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.  

జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ‌డిచిన ఏడాదిలో పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా జ‌రిగిన లోటుపాట్ల‌ను గ్ర‌హించి వాటిపై ప‌ట్టు సాధించేందుకు  రేవంత్‌ ఫోక‌స్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన త‌రువాత 26వ తేదీన రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రేవంత్ శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ప‌థ‌కంతో పాటు మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచే రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. అంత‌కు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ ప్రారంభించ‌బోయే ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌నున్నారు. 

కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్వ‌యంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు బంధు ప‌థ‌కం కింద రెండు ద‌ఫాలుగా ఎక‌రానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి రైతు భ‌రోసాగా నామ‌క‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప‌రిమితి లేకుండా రైతు బంధు ప‌థ‌కం అమ‌లైంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయం యోగ్యం కాని భూములు, రాళ్లుర‌ప్ప‌లు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసిన భూముల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌కు సైతం రైతు బంధు నిధులు ప‌డ్డాయి. దీంతో ప్ర‌జాధ‌నం భారీగా వృథా అయ్యిందని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేవ‌లం వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూముల‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా సాయం అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో ఉంటూ భూమి లేని వ్య‌వ‌సాయ రైతు కుటుంబాల‌కు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాగా పేరును ఖ‌రారు చేశారు. రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌ వుతు న్నాయి. అస‌లైన రైతుల‌కు, భూమిలేని కుటుంబాల‌కు మేలు జ‌రిగేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉంద‌ని పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్త‌కార్డులు రాలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్  హ‌యాంలో అర్హులైన వారంద‌రికీ కొత్త రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి 26వ తేదీనే శ్రీ‌కారం చుట్టాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాల‌న‌లో లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జానీకానికి అందించేందుకు రేవంత్ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతున్నది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.