రేవంత్ రెడ్డి రూటు మార్చకుంటే కష్టమేనా?

Publish Date:Feb 4, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అంశం ఏదైనా మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జరగనున్నాయా అన్నట్లుగా అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ట్విట‌ర్ ఖాతాలో పోల్ వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేల ర‌హ‌స్య మీటింగ్, సీఎంకు తెలియ‌కుండానే కులగ‌ణ‌న వివ‌రాలను మీడియాకు లీకవ్వడం, మ‌ధ్య మ‌ధ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల వ్యాఖ్య‌లు.. ఇలా..  రేవంత్ ప్ర‌భుత్వంలో ఏదో జ‌రుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

వాస్త‌వానికి.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి క్యాబినెట్ లోని సీనియ‌ర్ మంత్రుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకొనిపోతూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సీనియ‌ర్ మంత్రుల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయినా.. ప్ర‌భుత్వంలో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు ప‌ట్ల కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనంత‌టికీ రేవంత్ రెడ్డి అతి మంచిత‌న‌మే కార‌ణ‌మ‌న్న‌ వాద‌న పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. కొంద‌రు మంత్రుల‌కు అతి మ‌ర్యాద ఇస్తుండ‌టంతో దాన్ని వారు అలుసుగా తీసుకొని ప్ర‌భుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నార‌న్న వాద‌నను కాంగ్రెస్ లోని ఓ వ‌ర్గం నేత‌లు వినిపిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌కు మేలుచేసేలా కృషి చేస్తున్నారు. ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అయితే, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో పార్టీ క్యాడ‌ర్   విఫ‌ల‌మ‌వుతోంది. రైతు రుణ‌మాఫీకి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోవ‌టంతో ప్ర‌భుత్వంపై విప‌క్ష పార్టీల నేత‌లకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కాల అమ‌లుపైనా.. ఎవ‌రికి ల‌బ్ధిచేకూరుతుంద‌నే విష‌యాల‌పైన స్ప‌ష్టంగా గ్రామ‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న ఉంది. దీనికి తోడు ప్ర‌భుత్వంలో మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ లేద‌ని.. కొంద‌రు మంత్రులు రేవంత్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్నాయి. 

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా దెబ్బ‌ మీద దెబ్బ‌  త‌గులుతోంది.   వారం రోజుల కిందట మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఫాంహౌస్ కే ప‌రిమితం అయిన కేసీఆర్ ఒక్క‌సారిగా  అదే ఫామ్ హౌస్ నుంచి సమర గ‌ర్జ‌న చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే.. రేవంత్ స‌ర్కార్ కు ఇక ద‌బిడిదిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల త‌రువాత‌ ప‌ది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా భేటీ కావ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాల‌మూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే త‌న ఫాంహౌస్ లో ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందుల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు మంత్రులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదని,  ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు స‌రియైన స‌హ‌కారం అంద‌డం లేద‌నీ ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే  ఈ రహస్య విందు భేటీ వెనుక కేసీఆర్ హ‌స్తం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విట‌ర్ ఖాతాలో పెట్టిన పోల్‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఫామ్‌హౌస్ పాల‌న కావాలా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ కావాలా..? అంటూ పోల్ పెట్ట‌గా.. ఫామ్ హౌస్ పాల‌నే కావాలంటూ అధిక శాతం మంది  ఓటు వేశారు. ఈ ప‌రిణామం కాంగ్రెస్ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది అనే చ‌ర్చ‌కు దారితీసింది.

కులగ‌ణ‌న వివ‌రాల విష‌యంలో కొంద‌రు మంత్రులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింది. కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. మ‌రో వైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విష‌యంలో అన‌వ‌స‌ర‌పు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. 

కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి ఇటీవల మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌టంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ్గారెడ్డి కావాల‌నే రేవంత్ పేరు మ‌ర్చిపోయారా అన్న అనుమానాల‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్న‌విష‌య‌మే అయినా, సీఎం రేవంత్ ప‌ట్ల కాంగ్రెస్ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌న్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్ర‌భుత్వాన్ని సీరియ‌స్ గా న‌డిపించాలంటే రేవంత్ రెడ్డి  రూటు మార్చాల‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గట్టిగా వినిపిస్తున్నారు.   వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హార‌లో   లైన్ దాటిని వారిపై కొర‌డాఝుళిపించాల‌న్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది. 

By
en-us Political News

  
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.