అభ్యర్ధుల జాబితాతో రేవంత్ ముందస్తుకు రెడీ.. కాంగ్రెస్ లో కలకలం

Publish Date:Jun 16, 2022

Advertisement

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? అంటే, అందుకు ఇంకో సంవత్సరం పైగానే సమయముంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి శాసన సభను అర్ధాంతరంగా రద్దు చేసి ముందస్తుకు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ అదే బాటలో మరో మారు ముందస్తు ఎన్నికలు వెళతారని, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.  

ముందస్తు తధ్యమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విశ్వశిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ ఎన్నికలకు సిద్దమై పోతున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో,నవంబర్ లేదా డిసెంబర్’లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు  చేస్తారు.. నెక్ట్  ఇయర్  ఏప్రిల్, మే నెలల్లో  జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో  పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ... ఇది నా మాట.. నా మాటే శాసనం..అన్నట్లు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. 

అదలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొత్తం 119 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసి, జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇందులో ఎంత  నిజం వుంది, ఎంత లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటిస్తామని, మూడు నెలల ముందుగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని చెపుతూ వస్తున్నారు.

అదే క్రమంలో ఇప్పుడు జాబితా సిద్దం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, అసెంబ్లీ రద్దు కాకుండానే, ముందస్తు ఎన్నికలు ఉహించుకుని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తుందా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ముందుగా అభ్యర్ధులను ప్రకటించే కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు, ఆఖరి నిముషంలో అభ్యర్ధులను ఖరారు చేయడమే కాంగ్రెస్ సంప్రదాయం. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే సంప్రదాయం పాటించిందని, పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

మరోవంక, పార్టీ టికెట్ ఆశిస్తున్న అనేక మంది నాయకులు, రేవంత్ జాబితాలో తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు, పనిలో పనిగా అధిష్టానం పెద్దలకు తమ కోరికను వినిపించేందుకు ఢిల్లీకి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. అయితే, వీరు నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరట్ ( ఈడీ) విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సాలిడారిటీ తెలిపేందుకే ఢిల్లీ వెళ్ళినట్లు బిల్డప్ ఇస్తున్నా, స్వామి కార్యం స్వకార్యం చక్క బెట్టుకునేందుకే ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. అక్కడకు చేరిన రాష్ట్ర నాయకులు, ఢిల్లీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని  పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

మరో వంక రేవంత్ రెడ్డి జాబితాలో ఆయన తమ అనుకూల వర్గానికి చెందినవారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి, చేసిన వివాదస్పద, ‘రెడ్డి’ వ్యాఖ్యల నేపధ్యంగాను, పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి ఒక్కడే కుర్చుని జాబితా తయారు చేశారా? కాంగ్రెస్ పార్టీలో ఒంటరి నిర్ణయాలు చెల్లుతాయా  అనేది మరో చర్చగా వినవస్తోంది. అదెలా ఉన్నా, రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల అభ్యర్ధుల జాబితా సిద్ధం చేసింది నిజమైనా కాకున్నా,  సోషల్ మీడియాలో  మాత్రం మొత్తం 119 పేర్లతో జాబితా షికార్లు చేస్తోంది. దీనిపై  వంక వివాదాలూ మొదలయ్యాయి. 

అదలా ఉంటే, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు రావచ్చని అంటున్నారు. నిజానికి ఇటీవల హిజాబ్, హలాల్ వివాదాలు పతాక శీర్షికలకు ఎక్కిన సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతోనే బీజేపీ మత ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అంతే కాదు, ముందస్తు అంచనాలతోనే రాహుల్ గాంధీ ఏప్రిల్ లో లిగాయత్ ఓటు బ్యాంక్ టార్గెట్ గా తుముకూరు శ్రీ సిద్ధి గంగ మఠాన్ని సందర్శించారని  వార్తలొచ్చాయి. 
అయితే, అక్కడ  కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముందస్తు తధ్యం అంటున్నా, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ముఖ్యంత్రులు మాత్రం ముందస్తు లేదు వెనకస్తూ లేదు ... ఐదేళ్ళు అయిన తర్వాత, షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని,అంటున్నారు. అయితే రేవంత్ జాబితా కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపింది.

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.