జగన్ అయితే ఏంటి? మాజీ మంత్రి దాడి రాజీనామా.. పూతలపట్టు ఎమ్మెల్యే ఫైర్!

Publish Date:Jan 2, 2024

Advertisement

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో పార్టీ అస్థిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో అసమ్మతి, అసంతృప్తి ప్రజ్వరిల్లుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ అసంతృప్తి, అసమ్మతి వేడి సెగకు బెదిరిన  తన నైజానికి భిన్నంగా సిట్టింగుల మార్పు కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అసమ్మతీయులను బుజ్జగించి, సముదాయించే బాధ్యతలను రీజనల్ కో ఆర్డినేటర్లకు అప్పగించేసి వారికి ముఖం చాటేస్తున్నారు.

అయితే వైసీపీలో కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల మాట విని తగ్గండి అని అసమ్మతి ఎమ్మెల్యేలకు సూచించినా, వారు అందుకు సుముఖంగా లేరు. తమపై ప్రజా వ్యతిరేకత ఉంటే.. దానికి కారణం జగనే కనుక తమను నియోజకవర్గం నుంచి తప్పించడానికి కారణమేమిటో జగనే చెప్పాలని భీష్మిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఎదుటే నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. నిన్నటి దాకా జగన్ తనను తాను ప్రజాబాంధవుడిగా చెప్పుకుంటూ, పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎమ్మెల్యేలే అంటూ వారిని మార్చేస్తూ సేఫ్ గేమ్ ఆడదామనుకున్నారు. అయితే అత్యంత సహజంగా ఆయన ఆడదామనుకున్న సేఫ్ గేమ్ రివర్స్ అయ్యింది.

నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఎమ్మెల్యేలుగా తాము అనామకులుగా మారిపోయామనీ, ప్రజలలో ప్రభుత్వం పట్ల, తమ పట్ల అసమ్మతి, వ్యతిరేకత ఉంటే అందుకు పూర్తి బాధ్యత జగన్ దేననీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరైతే తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామాలు చేసేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉంటున్నారు. తమ రాజీనామా లేఖలలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ల పేరు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించడానికి, ధిక్కరించడానికీ ఇసుమంతైనా వెనుకాడటం లేదు. 

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏక వాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. అందులో తాను తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు.

అలాగే రాజీనామా ప్రతిని కూడా ఆయనకు పంపలేదు. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన దాడి వీరభద్రరావు 1985 నుంచి 1999 వరకూ వరుసగా నాలుగు సార్లు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. వృత్తి రిత్యా హిందీ టీచర్ అయిన దాడి వీరభద్రరావును ఆయన అనుచరులు, అభిమానులు ప్రేమగా మాస్టారూ అని పిలుస్తారు.  తన రాజీనామా లేఖలో అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు పేర్కొన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

ఇక జగన్ ను ప్రశ్నలతో నిలదీసిన మరో ఎమ్మెల్యే.. అసంతృప్తికి మొత్తం కారణం జగన్ అయితే తనను నియోజకవర్గం మార్చడమేమిటని సూటిగా ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేననీ, ఆయన తరువాత ఎవరికైనా ఏదైనా పని చేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలను బలిచేయడమేమిటని జగన్ ను ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నిర్మొహమాటంగా, నిష్కర్షగా ప్రజలలో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని చెప్పారు. అయినా ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై  లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా తాను జగన్ చెప్పిన ప్రతి పనీ చేశాననీ, గడపగడపకు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లాలని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు అసంతృప్తి అనేది ఉంటే అది తనపై కాదు, జగన్ పైనేనని స్పష్టంగా చెప్పేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో జగన్ పై ఫైర్ కావడం దాదాపు ఇదే తొలి సారి అని చెప్పవచ్చు. జగన్ అధికారం చేపట్టిన ఇన్నేళ్లల్లో ఒక్క సారి కూడా నియోజకవర్గ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా పిలిపించి మాట్లాడలేదనీ, అసంతృప్తి పేరుె చెప్పి దళిత ఎమ్మెల్యేలను దగా చేస్తున్నారనీ విమర్శించారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి డొక్కా కూడా  ఒక్క సారి అప్పాయింట్ మెంట్ ఇప్పించండి అని వేడుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వనంటే అంగీకరించేది లేదనీ, వైసీపీలోనే ఉండి పోరాడతానని అన్నారు. జగన్, మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని అంటూ  డబ్బులు ఇచ్చిన వాళ్లకు  ఐఫ్యాక్   సర్వే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నారు.  ఇప్పుడు సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలకు చేసిన విమర్శలకు జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.