Publish Date:Jul 29, 2025
కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో దాచుకుంటారు. అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు. వాటికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. అయితే, డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోని డబ్బు పెరిగిపోతోంది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలోని బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి ఎవరూ తీసుకోని డబ్బులు (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) ఏకంగా రూ. 67003 కోట్లు ఉన్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకుల్లోనూ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగినట్లు తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జూన్ 30, 2025 నాటికి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ. 58,330.26 కోట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో రూ. 8,673.72 కోట్లుగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 19,329.92 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 6,910.67 కోట్లు డిపాజిట్ చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.
కెనరా బ్యాంకులో రూ. 6,278.14 కోట్లు ఎవరూ తీసుకోని డిపాజిట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2063.45 కోట్లతో టాప్లో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ. 1609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ. 1360.16 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reserve-bank-of-india-25-203045.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.