తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో తన పర్యటనలు అట్టర్ ప్లాప్ కావడంతో తాజాగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బతుకమ్మ ఈవెంట్ టార్గెట్ గా ఏర్పాటైన జాగృతి సంస్థ ఇపుడు బిసీ నినాదాన్ని ఎత్తుకుంది. శుక్రవారం సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్ పిలుపునిచ్చిన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిసీలు గుర్తుకురాని కవిత సడెన్ గా బిసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేదు. ఈ ఎన్నికలను వాయిదావేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనాభాలో సగభాగం ఉన్న బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమిటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిందని గుర్తు చేయడానికి స్థానికసంస్థల ఎన్నికల వేళ బిసీజెండాను ఎత్తుకుంది. బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జాగృతి సంస్థ బతుకమ్మ వేడుకలను పూర్తిగా గాలికొదిలేసింది. కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ ఆ ఊసే లెకుండా బతుకమ్మ సంబరాలను స్కిప్ చేశారు.
ఇపుడు తాజాగా బీసీ డెడికేషన్ కమీషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుంకరిస్తున్నారు. అప్పట్లో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బిజెపితో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానీకానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షింతలు వేసింది . తెలంగాణ ఉద్యమానికి లిక్కర్ స్కాంకు ఉన్న సంబంధం ఏమిటో కవితనే సమాధానమిస్తే బాగుంటుంది. తెలంగాణా రాజకీయాల్లో మోస్ట్ వపర్ ఫుల్ పొలిటిషన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reservation-should-be-implemented-for-bcskavita-new-tune-39-190709.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.