కేంద్ర మంత్రి పదవిపై కన్నేసిన రేణుక
Publish Date:Mar 26, 2012
Advertisement
వివాదాస్పద కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తెలంగాణా కోటా క్రింద కేంద్రమంత్రి పదవిని పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణా ప్రాంతం నుంచి ఎన్నికైన జైపాల్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రేణుకా చౌదరి 1997-98 మధ్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగానూ 2006-2009 మధ్య మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) గా పనిచేశారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఆమె లక్షా యాభైవేల వోట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయ్యారు. అయినా అధిష్టానం దగ్గర ఆమె పలుకుబడి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు నోటి దురుసుతనం ఉందని తెలిసినప్పటికీ ఆమెను సోనియా గాంధీ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. 2000 వ సంవత్సరలో ఆమె హాసన్ ఆలీ అనే నగల వ్యాపారి నుంచి సుమారు కోటిన్నర రూపాయల విలువైన వజ్రపుటుంగరాన్ని బహుమతిగా స్వీకరించి వివాదాల పాలయ్యారు. 1993 జనవరిలో ఢిల్లీ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చేయిచేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. 2009 లో ఆమె పరాజయం పాలైనప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ నివాస భవనాన్ని ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. స్పీకర్ కార్యాలయం అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె ఖాతరు చేయలేదు. ఇటువంటి నేపథ్యం ఉన్న రేణుకా చౌదరి ఇప్పుడు తెలంగాణా కోటాలో కేంద్రమంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీతో సన్నిహితంగా ఉంటున్న ఆమెకు మంత్రి పదవి దక్కితే తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని కోస్తాకు చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు భయపడుతున్నారు. నిజానికి వీరిద్దరూ ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రేణుకా చౌదరి తెలుగుదేశం పార్టీనుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస పక్షి. అయితే ఈ వలస పక్షి కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరై సీనియర్లకు దక్కాల్సిన అవకాశాలను ఎగరేసుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
http://www.teluguone.com/news/content/renuka-chowdary-congress-former-minister-24-12906.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





