ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా?

Publish Date:Aug 13, 2026

Advertisement

 ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట  ప్రాంతంలో సంభవించిన   కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)  పటాపంచలు చేసింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అని తేల్చింది.  యూఎన్‌ఎస్సీ విడుదల చేసిన అధికారిక నివేదికలో..  ఎర్రకోట సమీపంలో జరిగిన  కారు బాంబు పేలుడు వెనుక ఉన్నది   అల్‌ఖైదా అనుబంధ వింగ్‌ అయిన  అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని విస్పష్టంగా పేర్కొంది.  

గత ఏడాది   నవంబర్ 10న  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న రద్దీ మార్గంలో  కారు బాంబు పేలుడు సంభవించింది.   ఈ పేలుడులో  11 మంది మరణింగా, పలువురు  గాయపడ్డారు. మొదట్లో ఈ   ఆత్మాహుతి  దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న  జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్ర సంస్థ అని అంతా అనుమానించారు.  పేలుడు జరిగిన కారు  నడిపిన వ్యక్తిని ఉమర్-ఎ-నబీగా విచారణ అధికారులు  గుర్తించారు. అతడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.

అయితే.. ఉగ్ర  కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే  యూఎన్‌ఎస్సీ  ఈ ఏడాది అగస్టు 10 (సోమవారం)  విడుదల చేసిన నివేదిక   ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సూత్రధారి  జైష్-ఎ-మొహమ్మద్ కాదనీ,   అల్‌ఖైదా ప్రాంతీయ విభాగమైన ఏక్యూఐఎస్ అనీ తేల్చింది.  2014వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న   ఏక్యూఐఎస్ సంస్థ..  ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్   ఆప్ఘనిస్థాన్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్, ఉగ్ర భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతంలో పెద్ద పెద్ద ముఠాలుగా దాడులు జరిపే పద్ధతికి భిన్నంగా, ఈ సంస్థ ప్రస్తుతం చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో విడిపోయి,  నిశ్శబ్దంగా బలోపేతం అవుతోందని ఆ నివేదికలో యూఎన్‌ఎస్సీ పేర్కొంది.

ఈ నివేదిక  ఇంకా  దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.   ఎర్రకోట పేలుడులో 11 మంది ప్రాణాలను బలిగొన్న  ఘటన వెనుక ఏక్యూఐఎస్ ఉందన్న  ఐరాస భద్రతా మండలి నివేదిక  ఇండియా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపింది. 

Red Fort blast, AQIS Al Qaeda, UNSC report,  Delhi blast, UN security council terror report

By
en-us Political News

  
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.