Publish Date:Dec 20, 2021
పీకే టీమ్ వచ్చింది. సర్వేలతో రంగంలోకి దిగింది. అందుకే, జగన్రెడ్డి నిర్ణయాల్లో మార్పు కనిపిస్తోంది. మోనార్క్లా, దూకుడుగా, దోచుకోవడమే పాలనలా.. రెండున్నరేళ్లు ప్రజలకు చుక్కలు చూపించిన ముఖ్యమంత్రి.. తాజాగా, తనకు అనుకూలంగా మాట తప్పుతున్నారు.. తనకు లాభం జరిగేలా మడమ తిప్పుతున్నారు.. అని అంటున్నారు. జగన్లో ఈ మార్పుకు కారణం ప్రశాంత్ కిశోరే అని టాక్.
మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం రద్దు చేయడం వ్యూహాత్మకం. కోర్టుల్లో టెక్నికల్గా నిలబడే ఛాన్స్ లేకపోవడంతో.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతలోనే మద్యం ధరలు తగ్గిస్తూ.. మందు బాబుల మత్తంతా దిగిపోయేలా వారికి గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు మాత్రం ఇది షాకింగ్ న్యూస్. ధరల తగ్గింపుతో.. ఇక మద్యపాన నిషేధం హామీ అటకెక్కించినట్టేనని అధికారికంగా చెప్పినట్టే. లిక్కర్ విషయంలో జగన్లో ఇంతటి మార్పు ఎవరూ ఊహించలేదు. పీకే టీమ్ ఫీడ్ బ్యాక్ వల్లే.. జగన్ ఇలా మాట తప్పి.. మడమ తిప్పి.. మద్యం ధరలు తగ్గించారని అంటున్నారు.
పెంచడమే కానీ తగ్గించడం తన డిక్షనరీలోనే లేని జగన్.. అందులోనూ భారీగా ఆదాయం వస్తున్న.. అప్పులకు ఊతం ఇస్తున్న మద్యం ధరలు తగ్గించడం మామూలు విషయం కానే కాదు. మరీ అంతలా పీకే టీమ్ జగన్ను ఎలా ఒప్పించిగలిగింది? సడెన్గా ధరలు తగ్గించడానికి కారణమేంటి? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఏపీలో జగన్ను విమర్శించే గొంతుకలు కోట్లల్లోనే ఉంటాయి. వారందరిలోకెల్లా మందుబాబులు తిట్టిపోసేంతగా మరెవరూ తిట్టుండరు. పెగ్గు పెగ్గుకీ జగన్కు శాపనార్థాలు పెడుతున్నారు. ఊరూపేరూలేని బ్రాండ్ల మద్యం తాగలేక.. జేబులు లూటీ చేసే ధరలు చెల్లించలేక.. మద్యం ప్రియులంతా.. బొట్టు బొట్టుకీ.. తిట్ల దండకం అందుకుంటున్నారు. మద్యం తాగే వారిలో రోజుకూలీలే అత్యధిక మంది ఉంటారు. వారంతా సీఎం జగన్ ను మద్యం దుకాణాల దగ్గర బండబూతులు తిడుతుంటారు. ఏపీలో ఏ చోటికి వెళ్లినా ఈ సీన్ కామన్.
జేబులకు చిల్లు పెట్టే.. ఆరోగ్యం గుల్ల చేసే.. మద్యం పాలసీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఐ-ప్యాక్ టీమ్ సర్వేలో తేలిందని తెలుస్తోంది. ఆ దారుణమైన ఫీడ్ బ్యాక్ జగన్ ముందు ఉంచి.. అత్యవసరంగా మద్యం ధరలను సవరించాల్సిందేనని తేల్చి చెప్పారని అంటున్నారు. పీకే బృందంపై ఎంతో నమ్మకం ఉంచే జగన్.. వారు చెప్పినట్టు చేయక తప్పలేదని చెబుతున్నారు. అందుకే, ఇన్నాళ్లూ దోచుకున్నాక.. తాజాగా ప్రభుత్వానికి బంగారు బాతులాంటి మద్యం ధరల్లో కాస్త వెసులుబాటు కల్పించారని టాక్. పీకే టీమ్ సూచనలతో.. త్వరలో మరిన్ని నిర్ణయాల్లోనూ జగనన్న మడమ తిప్పడం ఖాయమంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reasons-behind-liquor-prices-down-in-ap-25-128764.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు