Publish Date:Jan 21, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయాలలో విలువలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. రాజకీయాల ద్వారా ఆస్తుల సంపాదన వల్ల చెడ్డ పేరు వస్తుందని మనసావాచా కర్మణా నమ్ముతారు. తాను రాజకీయాలలో ఉన్నందున కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనూ ఎదుర్కోకూడదన్న భావనతో ఆయన వ్యాపారం ప్రారంభించాలని భావించారు. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపారాలు చేసినా అవి విఫలమయ్యాయి.
చివరకు హెరిటేజ్ ను స్థాపించారు. అది సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ఎన్నడూ హెరిటేజ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఆయన సతీమణి భువనేశ్వరే హెరిటేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. రాజకీయాలలోకి రాక ముందు నారా లోకేష్ హెరిటేజ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆ బాధ్యతలను ఆయన సతీమణి బ్రహ్మణి చూసుకుంటున్నారు. దీని వల్ల ఇటు తన రాజకీయాలకూ, అటు కుటుంబానికీ ఎటువంటి ఇబ్బందులూ రావడం లేదని అన్నారు. హెరిటేజ్ వల్లనే తమ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఉందన్నారు. దావోస్ వేదికగా చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు.
అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకూ గురి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరఫున కూడా ఒక కంపెనీ ప్రారంభించాలని భావించాననీ, ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అనుకున్నాననీ తెలిపారు. అయితే అందుకు చట్టాలు అంగీకరించకపోవడంతో ఆ పని చేయలేదని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ విత్ డయాస్పోరా పేరుతో తెలుగు పారిశ్రమిక వేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి దాదాపు 12 దేశాల నుంచి తెలుగు ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి తానా నాడు ఇంజినీరింగ్ కళాశాలు పెట్టాలని తీసుకున్న నిర్ణయం వల్లే మీరీనాడు ఇక్కడ ఉన్నారని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-cbn-start-heritage-25-191608.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.