రాయలసీమ ద్రోహి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రాయలసీమ హక్కుల పేరుతో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాజకీయ డ్రామాకు తెరలేపిందని ఆయనో ప్రకటనలో దుయ్యబట్టారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎన్నడూ రాయలసీమను పట్టించుకోలేదనీ, ఇప్పుడు సీమ హక్కుల పేర సభలు నిర్వహించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన పేర్కొన్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు. డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి రైతులకు నష్టం కలిగించారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టి ప్రజలను తప్పుదారి పట్టించారని తెలిపారు. 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులు నిలిపివేయాలని ఆదేశించిందని, అలాగే క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అనుమతులు లేకుండా పనులు చేయొద్దని స్పష్టం చేశాయని పేర్కొన్నారు.
2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి, శ్రీశైలంలో నీటిని ఆదా చేసి రాయలసీమకు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పం స్పష్టమన్న ఆయన హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా చర్యలు వేగవంతం చేశామని తెలిపారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rayalaseema-traitor-jagan-39-214901.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.