వైసీపీలో పాక పీకేసిన రాపాక!

Publish Date:Oct 14, 2024

Advertisement

గతంలో మాయలు, మంత్రాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యల్లాంటివి వుండేవి అంటూ వుంటారు. కానీ ఇప్పుడు ఆ విద్యలు తెలిసినవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఒకవేళ అక్కడడక్కడా ఒక్కళ్ళో, ఇద్దరో వున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూసి, వాళ్ళముందు తాము ఎందుకూ పనికిరామని తెలుసుకుని, తమకు వచ్చిన విద్యలు కూడా మరచిపోయి వుంటారు. అలాంటి కొంతమంది రాజకీయ నాయకులలో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని కూడా చేర్చవచ్చేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు. అన్ని స్థానాలకు పోటీ చేసినప్పటికీ ఒక్క రాజోలులో తప్ప జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ విజయం దక్కలేదు. అలా జనసేన తరఫున ఏపీ అసెంబ్లీలో ‘ఏక్‌నిరంజన్’గా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో జనసేన గళం వినిపించడానికి ఒక్క రాపాక అయినా మిగిలారని జనసేన వర్గాలు భావించాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలం రాముడు మంచి బాలుడిలా బుద్ధిగా వున్న రాపాక, ఆ తర్వాత పవన్ కళ్యాణ్’కి తన విశ్వరూపం చూపించారు. మెల్లగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడ్డం ప్రారంభించి, ఆ తర్వాత స్వరం పెంచారు. చివరికి జనసేన మీదే విమర్శలు చేసి వైసీపీలో పాక వేశారు. వైసీపీలో చేరిన ఉత్సాహంలో వున్న రాపాక అప్పట్లో జనసేన పార్టీ ఎప్పటికీ గెలిచే పార్టీ కాదని, ఏదో తాను ఒక్కడిని గాలివాటంగా గెలిచాను తప్ప, భవిష్యత్తులో జనసేనకు ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదు అని కరాఖండీగా చెప్పేశారు. అలాంటి రాపాక మొన్నటి ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన పార్టీతోపాటు తాను  కూడా విజయవంతంగా ఓడిపోయారు. 

వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో గత నాలుగు నెలలుగా ఉగ్గబట్టుకుని వున్న రాపాక ఇప్పుడు మెల్లగా తన ఒరిజినల్ స్ట్రేటజీ బయటకి తీశారు. వైసీపీని విమర్శిస్తూ ప్రకటన చేశారు. తనకు వైసీపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, తనను రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి అమలాపురం పార్లమెంట్ స్థానానికి వద్దు మొర్రో అన్నా వినకుండా పంపించారని, పార్టీలో తన మాటకు విలువ లేదు కాబట్టి తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఇంతవరకు బాగానే వుందిగానీ, రాపాకని టక్కుటమార విద్యలు తెలిసిన వాళ్ళతో ఎందుకు పోల్చినట్టా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

ఏ జనసేన పార్టీ అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిందో, ఆ జనసేన పార్టీ నమ్మకాన్ని పోగొట్టుకుని వైసీపీలో చేరిన రాపాక ఇప్పుడు ఎంతమాత్రం సిగ్గుపడకుండా, మొహమాటపడకుండా జనసేనలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో ఆదివారం నాడు జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిలవని పేరంటానికి వచ్చినట్టు రాపాక వరప్రసాద్ వచ్చేశారు. అక్కడకి వచ్చిన రాపాకని చూసి అందరూ షాకైపోయారు. రాపాక మెల్లగా అక్కడే వున్న రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ని కలసి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే, మళ్ళీ జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్‌తో రాయబారం చేయాల్సిన బాధ్యతని దేవవరప్రసాద్‌కి అప్పగించారని జనసేనలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నమ్మకం మీద తీవ్రమైన దెబ్బ కొట్టిన రాపాకను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని జనసేన నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. మరి జనసేన అధినేత రాపాకకి నో చెబుతారో... జనసేనలో మరోసారి పాక వేసుకోమని ఎంకరేజ్ చేస్తారో చూడాలి.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.