బీఆర్ఎస్ తో పొత్తుపై రాహుల్ క్లారిటీ!

Publish Date:Apr 18, 2023

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ పై అపారమైన ప్రేమకు కారణమేమిటన్నది రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్లుగా అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు.. రాష్ట్రంలో మారిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహనకు రాలేకపోతున్నారు. మరో సారి విపక్షంలో కూర్చోవడం కంటే.. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందని వారు భావిస్తున్న బీఆర్ఎస్ తో ఎలాగోలా పొత్తు కుదుర్చుకుంటే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  

అందుకే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులను అనుభవించిన జానా వంటి నేతలు  బీఅరేస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. తమ పలుకుబడి అంతా ఉపయోగించైనా సరే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు ముడి వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలపై ఆశలు లేకపోవడం ఒక కారణమైతే.. ఒక వేళ అధికారంలోకి వచ్చినా ఆ క్రెడిట్ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందన్న దుగ్ధ మరో కారణమని పరిశీలకులు అంటున్నారు. సీనియర్ల ఈ తీరు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చంద్రంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ల ప్రకటనలకు ఇక్ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాందీ నడుం బిగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని హస్తినకు తిరిగి వేళ్లే క్రమంలో ఆయన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కొద్ది సేపు ఆగారు. ఆ సందర్భంగా తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ తో పొత్తు అంటూ ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వంటి నేతలు చేసిన ప్రకటనలను ప్రస్తావించి.. అటువంటి అవకాశమే లేదని తేల్చేశారు. రాష్ట్రంలో ఒంటరిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే.. లక్ష్యమని విస్పష్టంగా చెప్పారు.

కర్నాటక ఎన్నికలు పూర్తి కాగానే.. తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కాంగ్రెస్ కు ప్రత్యర్థులేనని విస్పష్టంగా తేల్చేశారు. రాహుల్ ఈ విధంగా పార్టీ స్టాండ్ ను విస్పష్టంగా తేల్చేయడంతో ఇక సీనియర్లు ఏ విధంగా చూస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, సీనియరేతర్లు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయింది.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే వచ్చిన తర్వాత. గాంధీ భవన్ వాతావరణంలో కొంత మార్పు వచ్చి, నాయకుల మధ్య విభేదాలు అలాగే  ఉన్నా.. ఎవరి దారిన వారు పాద యాత్రలు, ఇతర కార్యక్రమాలలో బిజీ అయి పోయారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గాడిన పడిందని అంతా భావిస్తున్నా.. ఆ బావన తప్పు అంటూ   జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి వారు బీఆర్ఎస్ తో పోత్తు అంటూ ప్రకటనలు చేస్తూ.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటూ గుర్తు చేస్తున్నారు.

జానారెడ్డి ఇటీవల పొత్తు గురించి ప్రస్తావిస్తే.. ఆయన కంటే చాలా ముందు నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచే  అవకాశం ఉందని అన్నారు.  బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ బీఅరేస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని  హస్తిన  వేదికగా సంచలన ప్రకటన చేసి    పార్టీలో సునామీ సృష్టించారు. అయితే ఆ తర్వాత  రాష్ట్ర ఇన్ చార్జి ఠాక్రే జోక్యం చేసుకుని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.   ఇప్పడు మళ్ళీ అదే విషయాన్ని మరో  సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పెద్దలు అంటూ  గౌరవంగా సంభోదించే మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేవనెత్తి  తేనె తుట్టెను కదిల్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ  సీనియర్లు  కారుతో షికారు కావాలంటున్నారు.  ఈ పరిస్థితుల్లో  రాహుల్ గాంధీ స్వయంగా బీఆర్ఎస్ తో పొత్త ప్రశక్తే లేదని స్పష్టం చేయడంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా పార్టీ నుంచి సీనియర్లు బయటకు వెళ్లడానికి దారితీస్తుందా వేచిచూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.